Chandrababu: పౌల్ట్రీ అంటే గుర్తొచ్చేది సుందర నాయుడే
: రాయలసీమలోని రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు డాక్టర్ సుందర నాయుడు చేసిన కృషి మరువలేనిదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన రాత్రింబవళ్లు పల్లెల్లో తిరిగి, రైతులను పౌల్ట్రీ రంగం వైపు మళ్లించారని తెలిపారు.
ఆయన స్ఫూర్తితో నేనూ కొన్నాళ్లు ఆ రంగంలో ఉన్నా
బాలాజీ హేచరీస్ అధినేత శుభ స్వీకరణ కార్యక్రమంలో చంద్రబాబు
ఈనాడు డిజిటల్, చిత్తూరు: రాయలసీమలోని రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు డాక్టర్ సుందర నాయుడు చేసిన కృషి మరువలేనిదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన రాత్రింబవళ్లు పల్లెల్లో తిరిగి, రైతులను పౌల్ట్రీ రంగం వైపు మళ్లించారని తెలిపారు. అందుకే పౌల్ట్రీ అంటే సుందర నాయుడే గుర్తుకొస్తారని కొనియాడారు. అప్పట్లో విద్యార్థిగా ఉన్న తాను ఆయన స్ఫూర్తితో పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించానని.. తర్వాత రాజకీయాల్లోకి రావడంతో ఈ రంగంలో కొనసాగలేకపోయానని చంద్రబాబు చెప్పారు. పౌల్ట్రీ రంగ దిగ్గజం, బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ ఉప్పలపాటి సుందర నాయుడి శుభ స్వీకరణ కార్యక్రమం చిత్తూరులోని రెడ్డిగుంటలో ఆదివారం జరిగింది. సోదరుడి కుమారుడు వి.రమేష్ బాబు ఉత్తర క్రియలు నిర్వహించారు. చంద్రబాబు హాజరై సుందర నాయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి సుజీవన, కుమార్తెలు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నీరజ, అల్లుళ్లు ‘ఈనాడు’ ఎండీ కిరణ్, నవీన్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందర నాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ సుందర నాయుడు ప్రభుత్వోద్యోగం వదులుకుని ఈ రంగంలోకి వచ్చారు. అప్పట్లో రాయలసీమలో కరవు విలయ తాండవం చేసేది. ఉపాధి అవకాశాలు కొరవడి.. వలసలు ఎక్కువగా ఉండేవి. దీంతో పౌల్ట్రీ ద్వారా రైతులకు అదనపు ఆదాయం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని.. బీవీ రావుతో కలిసి దేశం మొత్తం పర్యటించి, పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో కోలుకుంటారని భావించా. ఆయన మృతి బాధ కలిగించింది. ఆయనిచ్చిన స్ఫూర్తి రైతుల్లో ఎప్పటికీ ఉంటుంది. అన్నదాతలకు ఎనలేని సేవలు అందించారు. సాధారణ రైతు కంటే పౌల్ట్రీ రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది.. తద్వారా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటారని సుందర నాయుడు ఆశించారు. ఆయన చూపిన మార్గాన్ని రైతులు అనుసరించాలి. పౌల్ట్రీ రైతులకు మేమంతా అండగా ఉంటాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రముఖుల నివాళి
డాక్టర్ సుందర నాయుడి శుభ స్వీకరణ కార్యక్రమానికి కిమ్స్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, భారత్ బయోటెక్ డైరెక్టర్లు సాయిప్రసాద్, జలచరి, నూజివీడు సీడ్స్ ఛైర్మన్ మండవ ప్రభాకరరావు, అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీలు ఎ.రామ్మోహన్రావు, విజయేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అమరనాథరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, అమర ఆసుపత్రి ఎండీ రమాదేవి, పీఈఎస్ వ్యవస్థాపకుడు దొరస్వామి నాయుడు, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, తెదేపా ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ కృష్ణయ్య, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ వ్యాపారులు, రైతులు హాజరై నివాళులర్పించారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి సుందర నాయుడు చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయనతో తనకు 30 ఏళ్ల పరిచయం ఉందని.. ఆయన పలకరించే విధానం, చూపించే ఆప్యాయత అందరి మనస్సుల్లో చిర స్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం