Regularisation: క్రమబద్ధకీకరణ!
తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రతిపక్ష నేతగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి మంత్రుల కమిటీ, వారికి సలహాలు ఇచ్చేందుకు మరో అధికారుల కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పక్కనున్న తెలంగాణలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఎప్పుడు?
ఇచ్చిన హామీ నెరవేర్చరెందుకు?
కమిటీల ఏర్పాటు తప్ప చర్యలేవి?
మూడేళ్లుగా ఎదురుచూపులు
ఈనాడు - అమరావతి
తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రతిపక్ష నేతగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి మంత్రుల కమిటీ, వారికి సలహాలు ఇచ్చేందుకు మరో అధికారుల కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పక్కనున్న తెలంగాణలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రెగ్యులర్ ఉద్యోగులకు లభించే సదుపాయాలు కాంట్రాక్టు వారికి అందడం లేదు. ప్రభుత్వంలో 13,671 మంది, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు కలిపితే 50,000 వరకు ఒప్పంద ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వంలో పని చేసేవారిలో అత్యధికంగా 6,400 మంది వరకు బోధన విభాగంలోనే ఉన్నారు. ఏటా ఏప్రిల్ వచ్చేసరికి తమ సర్వీసు పునరుద్ధరణ అవుతుందో లేదోనని వారు ఎదురుచూడాల్సిన దుస్థితి వస్తోంది. పీఎఫ్ సదుపాయం లేదు. ఆరోగ్యకార్డులు ఇవ్వడం లేదు.
కమిటీలతోనే కాలయాపన..
ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవల రెగ్యులరైజేషన్, సంబంధిత అంశాలపై అధ్యయనం చేసేందుకు 2019 జులై 10న ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి మంత్రులు కూడా మారిపోయారు. ఇంతవరకు దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఈ కమిటీ ఒకటి, రెండు పర్యాయాలు మాత్రమే సమావేశమైంది. ఆ తర్వాత ఆ ఊసే లేకుండాపోయింది. మంత్రుల కమిటీకి సలహాలు ఇచ్చేందుకని 2019 నవంబరు 26న అధికారులతో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. 2020 మార్చి 31లోపు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఆ తర్వాత 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించింది. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దాదాపు మూడేళ్లు కావొస్తుండగా.. అధికారుల కమిటీ నివేదిక సమర్పించే గడువు ముగిసి సుమారు రెండేళ్లు అవుతోంది. ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి వెంట నడిచిన కాంట్రాక్టు ఉద్యోగులకు మూడేళ్లవుతున్నా ఎదురుచూపులు తప్పడం లేదు.
కరోనా కాటేసినా పరిహారం లేదు..
రాష్ట్రంలో 25 మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు కరోనాతో చనిపోయారు. వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పినా ఒక్కరికీ ఇవ్వలేదు. ఒప్పంద ఉద్యోగుల సేవలను ఏటా పునరుద్ధరిస్తూ వస్తున్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల్లో కొత్త ఉద్యోగ నియామకాలు, బదిలీలు జరిగితే కొందరు పోస్టులు కోల్పోతున్నారు. ఇలా ఉద్యోగాలు పోయిన వారిని వెంటనే సర్దుబాటు చేయడం లేదు. మూడు, నాలుగు నెలల సమయం పడుతోంది. ఆ కాలంలో వేతనాలు ఇవ్వడంలేదు. కొన్నిసార్లు సొంత జిల్లాలు కాకుండా దూర ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇటీవల కళాశాలల్లో జరిగిన బదిలీలు, కొత్త నియామకాలతో ఉద్యోగాలు పోయిన వారికి వంద కిలోమీటర్ల దూరంలోనూ పోస్టింగ్లు ఇచ్చారు. వైద్య, ఆరోగ్యశాఖలో కొందరు పదవీవిరమణ కూడా పొందుతున్నారు. వీరికి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. సెలవుల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. బోధన సిబ్బందికి ఏడాదికి కేవలం 10 సెలవులు మాత్రమే ఇస్తున్నారు.
ఆందోళనలకు సిద్ధం
‘ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ప్రతి సమావేశంలోనూ క్రమబద్ధీకరణ గురించి చెప్పారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. ఆ హామీ నిలబెట్టుకోకపోతే ఆందోళనలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం’’
-పెనుమర్తి వీరబాబు, కన్వీనర్, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాల ఐకాస
అసెంబ్లీలో చెప్పినా చేయలేదు
‘‘ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారంలోకి రాగానే క్రమబద్ధీకరిస్తామన్నారు. అర్హతలనుబట్టి రెగ్యులరైజ్ చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టాక అసెంబ్లీలో చెప్పారు. గతంలో హెచ్ఆర్ఏ, డీఏలను కలిపి కన్సాలిడేటెడ్ పే ఇచ్చేవారు. ఇప్పుడు బేసిక్ మాత్రమే ఇస్తున్నారు.’’
- విజయకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ సమాఖ్య
మేం అధికారంలోకి రాగానే..అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, చదివిన చదువులను పరిగణనలోకి తీసుకుంటాం. కాంట్రాక్టులో పని చేస్తున్నవారిలో వీలైనంత ఎక్కువమందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నాం.
- ఎన్నికల ముందు పలు సభలలో ప్రతిపక్ష నేతగా జగన్
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును బట్టి వీలైనంతమందిని రెగ్యులరైజ్ చేస్తాం.
- వైకాపా మేనిఫెస్టోలో హామీ
ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.
- పలు సభలలో ప్రతిపక్ష నేతగా జగన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!