Sonia Gandhi: పార్టీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది
ఏ పార్టీకైనా మనుగడ కాపాడు కోవడంతో పాటు ముందడుగు వేయాలంటే ఎప్పటికప్పుడు అంతర్గత పరివర్తన అవసరం. రణ నీతిలో మార్పు, సంస్థాగత సంస్కరణ, రోజు వారీ పని తీరులో మెరుగుదల అత్యంత ముఖ్యం. మన పునరుత్థానం అందరిసామూహిక ప్రయత్నం ద్వారానే సాధ్యం. కాంగ్రెస్పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు నిర్వహిస్తున్న శిబిరం ఒక ప్రభావవంతమైన ముందడుగు కావాలి.
స్వప్రయోజనాలు పక్కనపెట్టి పని చేయాలి
సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలవాల్సిన తరుణమిది
పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ దిశానిర్దేశం
మోదీ ప్రభుత్వం దేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందంటూ ధ్వజం
ఉదయ్పుర్లో కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరం ప్రారంభం
ఏ పార్టీకైనా మనుగడ కాపాడు కోవడంతో పాటు ముందడుగు వేయాలంటే ఎప్పటికప్పుడు అంతర్గత పరివర్తన అవసరం. రణ నీతిలో మార్పు, సంస్థాగత సంస్కరణ, రోజు వారీ పని తీరులో మెరుగుదల అత్యంత ముఖ్యం. మన పునరుత్థానం అందరి సామూహిక ప్రయత్నం ద్వారానే సాధ్యం. కాంగ్రెస్పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు నిర్వహిస్తున్న శిబిరం ఒక ప్రభావవంతమైన ముందడుగు కావాలి.
-సోనియా గాంధీ
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హెచ్చరించారు. 2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలను బూచిగా చూపుతూ ప్రజల మధ్య విరోధాలు పెంచి భయాందోళనలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని నేతలకు ఆమె సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని ఉదయ్పుర్లో కాంగ్రెస్ నవసంకల్ప శిబిరంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ... నేతలకు ఎంతో చేసిందని, ఇప్పుడు దాని రుణం తీర్చుకొనే సమయం వచ్చిందని ఉద్బోధించారు. మేధోమథన సదస్సు అనంతరం పార్టీ అంతా ఐక్యంగానే ఉందన్న సందేశం దేశ ప్రజలకు వెళ్లాలని సోనియా గాంధీ సూచించారు. ఆమె తన ప్రసంగాన్ని ఆంగ్లం, హిందీలో కొనసాగించారు. మోదీ ప్రభుత్వ వైఖరిని తూర్పారపడుతూనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ముందు గతంలో ఎన్నడూలేని సవాళ్లున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు పార్టీ అందరికీ చాలా ఇచ్చింది. ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులందరూ మనసు విప్పి అభిప్రాయాలు చెప్పండి. వెలుపలికి మాత్రం పార్టీ బలోపేతం, దృఢనిశ్చయత, ఏకత అన్న సందేశం ఒక్కటే వెళ్లాలి. ఎదురైన ఎత్తుపల్లాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలుపొందాల్సిన సమయమిది. మన మీద ప్రజలు పెట్టుకున్న ఆశలను విస్మరించకూడదు చింతన శిబిరం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కొత్త ఆత్మవిశ్వాసం, శక్తి, ఉత్సాహకరమైన ప్రేరణతో వెళ్లాలి’’ అని సోనియాగాంధీ పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీపై మాటల దాడి...
* ప్రధాని మోదీ, ఆయన మంత్రులు తరచూ చెప్పే గరిష్ఠ పాలన..కనిష్ఠ ప్రభుత్వం అర్థం దేశాన్ని శాశ్వతంగా కుల, మతాల పునరేకీకరణలోకి నెట్టేయడమే. సమాజంలో అంతర్భాగమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులుచేసి ప్రజలు నిరంతరం భయాందోళనలు, అభద్రతలో బతికే వాతావరణాన్ని ఈ ప్రభుత్వం సృష్టిస్తోంది. ఏళ్ల తరబడి వస్తున్న భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని ధ్వంసం చేయడమే వీరి విధానం.
* భాజపా ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టి వారికున్న పరువుప్రతిష్ఠలపై బురదజల్లుతోంది. విపక్ష నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి తప్పుడు కారణాలతో జైళ్లలో పెడుతోంది. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థల స్వతంత్రతను దెబ్బతీస్తున్నారు. చరిత్రను మొత్తం టోకుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
* స్వాతంత్య్ర సమరయోధులను తక్కువ చేసి చూపే ప్రయత్నం నిరంతరం జరుగుతోంది. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి చేసిన సేవలు, త్యాగాలను కనుమరుగుచేయడానికి, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్రపూరిత వ్యూహం అమలుచేస్తున్నారు. మహాత్మాగాంధీ హంతకులను, వారి భావజాలాన్ని కీర్తిస్తూ రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం అన్న మూలసూత్రాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు.
* దళితులు, ఆదివాసీలు, మహిళలతో పాటు దేశవ్యాప్తంగా బలహీన వర్గాలపై నిరంతరం దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వం కన్నెత్తి చూడటంలేదు.
* బ్యూరోక్రసీ, కార్పొరేట్ సంస్థలు, పౌర సమాజం, మీడియాను భయపెట్టి గుప్పిట్లో ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మన రాజ్యాంగంలో నిక్షిప్తమైన ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా విస్మరిస్తున్నారు.
* ప్రభుత్వం రగిలిస్తున్న విభేదాలు, విద్వేషాగ్నికి ప్రజలు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఇది మన ఊహకందని తీవ్రమైన సామాజిక విపరిణామాలకు దారితీస్తోంది.
* దేశంలోని అత్యధిక మంది ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించాలనుకుంటున్నారు. కానీ భాజపా, దాని అనుబంధ సంస్థలు మాత్రం ప్రజలు విద్వేషాల మధ్య పోట్లాడుకోవాలని కోరుకుంటూ నిరంతరం రెచ్చగొడుతున్నాయి. సమాజాన్ని విషతుల్యంగా మార్చే ఈ వైరస్కు వ్యతిరేకంగా మనం గట్టిగా పోరాడాలి.
* యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి సుస్థిర ఆర్థిక వృద్ధి అవసరం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే మనం ఆదాయం పెంచుకోవాలి. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న సామాజిక పరిస్థితులు ఆర్థిక వృద్ధి పునాదులను దెబ్బతీస్తున్నాయి.
* 2016 నవంబరులో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం మొదలైంది. భారీ సంఖ్యలో కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. నిరుద్యోగం ఆందోళనకరంగా పెరిగిపోయింది.
* రైతు సంఘాల పట్టుదల కారణంగా మోదీ ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. చట్టాల రద్దు సమయంలో ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలను ఇంతవరకూ అమలు చేయలేదు. పైగా ఈ సంవత్సరం గోధుమ సేకరణ దారుణంగా పడిపోయింది. దీంతో ఆహారభద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* వంట గ్యాస్, వంటనూనె, తిండిగింజలు, పండ్లు, కూరగాయలు, ఎరువులు, పెట్రో ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరిగిపోతూ కోట్ల కుటుంబాలపై మోయలేని భారాన్ని మోపాయి.
* ప్రభుత్వరంగ సంస్థలను ఇప్పుడు పగతో ప్రైవేటీకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశం పూర్తిగా మూసుకుపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం