Election Commission: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్‌కుమార్‌ మీనా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌-సీఈవో)గా 1998 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న కె.విజయానంద్‌ స్థానంలో...

Updated : 14 May 2022 05:00 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌-సీఈవో)గా 1998 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న కె.విజయానంద్‌ స్థానంలో ఆయన్ని నియమిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు