Amit Shah: ఇంత అవినీతి ప్రభుత్వాన్ని, అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు
తెలంగాణలో రజాకార్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..
కేసీఆర్ను తరిమితేనే రజాకార్ పాలన అంతం
ఒక్క హామీనీ నెరవేర్చకుండానే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి
నిధులు, నీళ్లు నియామకాలు నెరవేరుస్తాం
మైనారిటీ రిజర్వేషన్లు తగ్గిస్తాం
ముందస్తు ఎన్నికల యోచనలో కేసీఆర్
అందుకు మేమూ సిద్ధమే
ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్ షా
నయా నిజాంను గద్దె దించేద్దాం...
తెలంగాణ నుంచి నయా నిజాం నవాబును వెళ్లగొట్టాలా వద్దా... పాలనలో మార్పు రావాలని కోరుకునేవారంతా చేతులు పైకెత్తి మద్దతు తెలపండి. ప్రజా సంగ్రామ యాత్ర భాజపా అధికారం కోసమో.. ఒకరిని దించి మరొకరిని సీఎంగా చేయడానికో కాదు. దళితులు, ఆదివాసీ, యువత, రైతుల సంక్షేమానికి చేస్తున్న యాత్ర. రాష్ట్రంలో రజాకార్ ప్రతినిధి కుటుంబ పాలన సాగుతోంది. ‘‘నా కొడుకు, నా బిడ్డ’’ అంటూ కేసీఆర్ సాగిస్తున్న అవినీతి పాలనను అంతమొందించడానికే ఈ యాత్ర.
- అమిత్ షా
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో రజాకార్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే కేసీఆర్ పూర్తి చేస్తారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఎవరో తాంత్రికుడు చెప్పాడని సీఎం సచివాలయానికి వెళ్లడం లేదన్నారు. కేసీఆర్ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆయనను గద్దె దించేందుకు యువత కదిలి రావాలన్నారు. తెలంగాణ ఎవరి జాగీరూ కాదని, అందరికీ సమానహక్కు ఉందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ మరో బెంగాల్గా మారుస్తున్నారని, హత్యా రాజకీయాలతో తమ కార్యకర్త సాయిగణేశ్ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని జైలుకు పంపుతామన్నారు. తెరాస, మజ్లిస్ పార్టీలు అవిభక్త కవలలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నారని, ఎన్నికలకు తామూ సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ను, మజ్లిస్ను గద్దె దించిన నాడే తెలంగాణకు విమోచన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక.. మైనార్టీల రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు కోటా పెంచుతామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారుతోపాటు, తెలంగాణలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పడాలని.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఉప్పుడు బియ్యం కొంటామని హామీ ఇచ్చారు.
పథకాలకు పేర్లు మార్చి..
‘మోదీ ప్రభుత్వం రాష్ట్రం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ కేంద్ర పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద కేంద్రం నిధులిస్తే.. మన ఊరు..మనబడి’ పేరుతో మీ కుమారుడి పేరు పెట్టి అమలు చేస్తున్నారు. రూ.18 వేల కోట్లు ఉపాధి హామీ పథకానికిస్తే మీ, మీ కుమారుడి ఫొటోలు పెట్టుకున్నారు. ప్రధాని ఆవాస్ యోజన పేరు మార్చినా ఇళ్లు ఇవ్వలేదు. పీఎం అన్న కల్యాణ్ యోజన కింద ప్రతి వ్యక్తికి ప్రతి నెలా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంటే మీ ఫొటోలతో పంపిణీ చేస్తున్నారు.
ఆ పథకాల అమలేది?
కేంద్ర పథకాలను తెలంగాణ అమలు చేయడం లేదు. ఆయుష్మాన్భారత్ కింద పేదలకు రూ.5 లక్షల వరకూ వైద్యం చేస్తామంటే అడ్డుకుంటున్నారు. పంటలబీమా పథకం అమలు చేయడం లేదు. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, రాజోలిబండ వంటి పథకాలకు కేంద్రం నిధులిచ్చినా అమలు చేయడం లేదు. సైన్స్ సిటీ పెడతామంటే 25 ఎకరాలు ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లాలో సైనిక్ స్కూల్ పెడతామని 2017 నుంచి కేంద్రం లేఖలు రాస్తున్నా స్పందించలేదు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ సంక్షేమానికి రూ.2,52,202 కోట్లు ఇచ్చారు. రేపు మీడియాలో ఈ జాబితా మొత్తం వస్తే చదువుకోండి. మేం ఏం ఇచ్చామో తెలుస్తుంది. ప్రాంతీయ రింగురోడ్డుకు రూ. 8 వేల కోట్లు, గ్రామీణ సడక్ యోజనకు రూ.17 వేల కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.25 వేల కోట్లు ఇచ్చాం.’
ఎన్నికలకు సిద్ధం
మజ్లిస్కు భయపడే 370 ఆర్టికల్ రద్దును కేసీఆర్ వ్యతిరేకించారు. భాజపా భయపడదు. ఆ రెండు పార్టీలనూ ఒకేసారి పక్కకు నెట్టి అధికారంలోకి వస్తుంది. తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తుంది. తెరాస కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది. కేసీఆర్ వారసత్వ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి. కుమారుడు, కుమార్తె కోసం కేసీఆర్ ఎన్ని స్కాములు చేశారో. శాసనసభలో ఒక్క సీటు గెలిచిన భాజపా ఎంపీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకుంది. బల్దియా ఎన్నికల్లో 40 స్థానాలు గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్లలో మేమే గెలిచాం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మాకూ కావాలి. రేపు ఎన్నికలు పెట్టినా భాజపా సిద్ధంగా ఉంది’ అని అమిత్షా స్పష్టం చేశారు.
కేసీఆర్ను దించడానికి బండి సంజయ్ ఒక్కరు చాలు
బండి సంజయ్ చేపట్టిన యాత్ర గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. యాత్రకు లభిస్తున్న ప్రజాదరణ గురించి వింటున్నా. ఈ సభలో సంజయ్ ప్రసంగం విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. కేసీఆర్ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ ఒక్కరూ చాలు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో 770 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేశారు. ఈ యాత్ర కొనసాగించడానికి మిస్డ్కాల్ ఇవ్వండి. అందరూ ఫోన్ తీసి పైకి చూపండి. 6359119119 నంబరుకు మిస్డ్కాల్ ఇవ్వండి. బండి యాత్రను మీరు సమర్థిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.
హామీలు అటకెక్కాయి...
‘కేసీఆర్ ఇచ్చిన హామీలు.. నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరాయా చెప్పండి. భాజపా అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగులకు భృతి వచ్చిందా? రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేశారా? లేదు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించలేదు. రెండు పడకగదుల ఇళ్లు లేవు. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు కూడా నిర్మించలేదు. దళితులకు కేటాయించిన రూ.50 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది? ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఏమైంది? 30 సెంటీమీటర్లు కూడా ఇవ్వలేదు. టీచర్ పోస్టుల భర్తీని కేసీఆర్ అటకెక్కించారు. హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టలేదు. మీ కుమారుడు, కుమార్తెకు అధికారం ఇచ్చి సర్పంచులు, ఉపసర్పంచులకు అధికారాలివ్వడం మర్చిపోయారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1340 ఉంటే.. మోదీ ప్రధాని అయ్యాక రూ.1940కి పెంచారు. కేంద్రం ధాన్యం కొనడం లేదని కేసీఆర్ కాకమ్మ కథలు చెబుతున్నారు. ఉప్పుడు బియ్యం కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మీకు కొనడం చేతకాకపోతే రాజీనామా చేయండి. భాజపా వస్తే ప్రతి కిలో ధాన్యాన్నీ కొంటుంది. ఉప్పుడు బియ్యమైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!