వీధివీధినా ప్రశ్నల వర్షం
ఎన్నికల హామీలపై, రైతుల కష్టాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వివిధ గ్రామాల్లో ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వారు మంగళవారం వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా
‘గడప గడప’లో కొనసాగుతున్ననిలదీతల పర్వం
ఎన్నికల హామీలపై, రైతుల కష్టాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వివిధ గ్రామాల్లో ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వారు మంగళవారం వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ‘అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేద’ని విజయవాడలో కొందరు ప్రశ్నించారు. వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత మా గ్రామంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని, ముఖ్యమంత్రి పాలన ఏమీ బాగోలేదని ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేను నిలదీశారు.
ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారు?: ఇళ్ల స్థలాలు ఇస్తామని మూడేళ్ల కిందట ఇచ్చిన హామీని ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును భవానీపురం వాసులు ప్రశ్నించారు. వెలంపల్లి మాట్లాడుతూ... విజయవాడ వాసులకు అమరావతిలో స్థలాలు ఇచ్చామని, చంద్రబాబు కేసులు వేయించడంతో ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిందన్నారు.నిర్ణేతలు... ధర్మాధికారులు మీరే!: ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్యేలు ఇంటింటికీ ముఖ్యమంత్రి సంతకంతో ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు 50 ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ పత్రాన్ని ఇస్తున్నారు. ‘నిర్ణేతలు మీరే... ధర్మాధికారులు మీరే.. మూడేళ్ల పాలనలోనే ఇన్ని మంచి మార్పులకు
శ్రీకారం చుట్టింది నిజమా.. కాదా? అన్నది మీరే నిర్ణయించడానికి వీలుగా ప్రజాబ్యాలెట్ను మీ చేతికి ఇస్తున్నాం’ అని రెండు బాక్సులను పొందుపర్చారు. ప్రజలకు ప్రశ్నలను వివరించి, టిక్కులను పెట్టించే బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించారు.
సీపీఎస్ రద్దు చేశాకే మా గడప తొక్కండి: ప్యాపిలి మండలం మెట్టుపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు డి.చిన్నపరెడ్డి సీపీఎస్ రద్దు హామీ నెరవేరని తీరుపై వినూత్నరీతిలో నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా డోన్లోని కొత్తపేటలో నివసిస్తున్న ఆయన సీపీఎస్ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేశాకే... మంత్రి, శాసనసభ్యుడు, ప్రభుత్వ ప్రతినిధులు.. ఇలా ఎవరైనా సరే మా గడప వద్దకు రావాలని బోర్డులో రాసి గేటుకు వేలాడదీయడం గమనార్హం.
పథకాలన్నీ అందడం లేదు: తమకు అర్హత ఉన్నా... ప్రభుత్వ పథకాలు అందడంలేదని, భూముల సమస్యలూ తీరడం లేదని పల్నాడు జిల్లా నూజండ్ల మండలం పమిడిపాడులో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎదుట స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఆయన తెలిపారు.
సీఎం పాలన బాగోలేదు: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వేములపల్లిలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నత్తా చంద్రరావు అనే యువకుడు సీఎం పరిపాలన బాలేదని సమాధానమిచ్చారు. రైతు ఎక్కడ సంతోషంగా ఉన్నాడు?: రైతు సంతోషంగా ఉన్నది ఎక్కడంటూ కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాతమాజేరులో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబును మాజేరు మాజీ సర్పంచి, తెదేపా నాయకుడు యార్లగడ్డ శివరామ్ నిలదీశారు.
- న్యూస్టుడే యంత్రాంగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య