పోలవరంపై ఎత్తిపోతలు సరికాదు
పోలవరం జలాశయంపై చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరి వరద జలాల సమర్థ వినియోగానికి ప్రారంభించిన పోలవరం కుడి కాలువ
టన్నెళ్ల సామర్థ్యం పెంపు, వెడల్పు కుదరదు
మీ ఇష్టమొచ్చినట్లుగా నిర్మాణాలు సాధ్యం కాదు
డీపీఆర్ సిద్ధం చేసి పంపితే పరిశీలిస్తాం
కేంద్ర జలశక్తి శాఖ అభ్యంతరాలు
ఈనాడు, అమరావతి: పోలవరం జలాశయంపై చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరి వరద జలాల సమర్థ వినియోగానికి ప్రారంభించిన పోలవరం కుడి కాలువ టన్నెళ్ల సామర్థ్యం పెంచే పనులనూ చేపట్టడానికి వీల్లేదంది. దిల్లీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో ఈ రెండు అంశాలూ చర్చకొచ్చాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఈ పనులపై గతంలోనే అభ్యంతరం తెలిపింది. కేంద్ర జల్శక్తిశాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాలనీ సూచించింది.
పోలవరం జలాశయంలోని డెడ్ స్టోరేజీ నీటిని వాడుకునేందుకు ఎత్తిపోతలు నిర్మిస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా మెట్ట ప్రాంతాల అవసరాల కోసం ఈ పథకం చేపట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున జనవరి నుంచి ఏప్రిల్ల మధ్యలో అవసరమైనప్పుడు ఎత్తిపోసి వినియోగించుకుంటారు. ఈ మేరకు ఎత్తిపోతల పనులకు రూ.914 కోట్లతో పాలనామోదం ఇచ్చి టెండర్లు పిలిచారు. రూ.765.94 కోట్లకు మేఘా సంస్థ పనులు దక్కించుకుంది. వెంటనే ప్రాథమిక పనులను చేపట్టారు.
మరోవైపు ప్రాజెక్టులో కుడి కాలువ టన్నెళ్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి వరద జలాలను మరింత సద్వినియోగం చేసుకునేందుకు ఈ ఆలోచన చేశారు. ప్రస్తుతం టన్నెళ్లను వెడల్పు చేస్తున్నారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం నుంచి లేఖ అందింది. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ చర్చ జరిగింది.
ఇవీ కేంద్రం అభ్యంతరాలు...
* ఎత్తిపోతల ద్వారా డెడ్ స్టోరేజీ నీటిని ఎలా వినియోగించుకుంటారు? ఆ నీటిని వాడుకుంటే ప్రాజెక్టు మళ్లీ నిండేందుకు సమయం పడుతుంది. ఈలోపు పోలవరం కింద నిర్దేశించిన ఇతర అవసరాలకు నీటిని ఇవ్వడం సాధ్యం కాదు.
* గోదావరి డెల్టాలో రబీ అవసరాలకు సాగునీటి ఇబ్బంది తలెత్తుతుంది.
* పోలవరం ప్రాజెక్టు టన్నెళ్ల సామర్థ్యం ఎలా పెంచుతారు?
* మీ అంతట మీరే ఈ పనులు ఎలా చేపడతారు?
ఇదీ రాష్ట్రం వాదన...
* పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిపై దిగువ ప్రాంతంలో ఉంది.
* ఎగువన నీటిని వినియోగించుకున్న తర్వాతే వరద జలాలు దిగువకు వస్తాయి. అంటే ఇతర రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావమూ పడదు.
* ప్రతి ఏటా 2 వేల టీఎంసీల నుంచి 3 వేల టీఎంసీల వరకు వరద జలాలు సముద్రం పాలవుతున్నాయి.
* మాకు వచ్చిన నీటిని మేం వినియోగించుకునేందుకు మాత్రమే ఈ పథకాలను చేపడుతున్నాం.
సమగ్ర వివరాలను పంపించండి
* గోదావరిపై ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, ఏపీ కొత్తగా కడుతున్న ఎత్తిపోతల పథకాలు, ఇప్పటికే ఉన్న పథకాల నీటి అవసరాలను చెప్పాలి.
* వీటికిందున్న ఆయకట్టు, నీటి అవసరాలు తెలపాలి. ఎంత నీటిని వినియోగించుకుంటున్నారో పేర్కొనాలి.
* మీరు ఏం పనులు చేపట్టినా డీపీఆర్లు రూపొందించి కేంద్ర జలసంఘానికి పంపాలి. వారు అధ్యయనం చేసిన తర్వాత అనుమతులు ఇస్తారు.
జలాశయం పనుల నాణ్యతపైనా చర్చ
దిల్లీలో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. పనులను పరిశీలిస్తూ... నాణ్యత పెంచేందుకు ఇద్దరు అధికారులను ప్రాజెక్టు వద్దే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. వారు క్షేత్రస్థాయిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ పనుల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటారు.
* కేంద్ర జలసంఘం డైరక్టర్ స్థాయి అధికారిని కూడా పోలవరం ప్రాజెక్టు క్షేత్రం వద్ద నియమించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ