చటాన్పల్లి ఎన్కౌంటర్ కట్టుకథే..!
సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కట్టుకథ అని జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ కమిషన్ తేల్చింది. ఇందులో పాల్గొన్న పదిమంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన
ఆత్మరక్షణకే కాల్పులు జరిపారనేందుకు ఆధారాల్లేవ్
దిశ కేసులో పొంతన లేని వాదనలు.. విరుద్ధమైన నివేదికలు
నలుగురు నిందితుల్ని చంపాలనేదే పోలీసుల ఉద్దేశం
పది మంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాల్సిందే
జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నివేదికలో వెల్లడి
సుప్రీంకోర్టుకు సమర్పణ
ఈనాడు, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కట్టుకథ అని జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ కమిషన్ తేల్చింది. ఇందులో పాల్గొన్న పదిమంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సూచించింది. 2019 డిసెంబరు 6న షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి శివార్లలో జరిగిన కాల్పుల్లో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్లు మరణించిన ఉదంతంపై సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తి చేసిన కమిషన్ 383 పేజీల నివేదికను సమర్పించింది. ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు జరిపామన్న పోలీసుల వాదనను తూర్పారబట్టింది. పోలీసుల వాదనల్లో పొంతనే లేదని.. కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని స్పష్టం చేసింది. నిందితులను చంపాలనే ఉద్దేశమే పోలీసుల్లో కనిపించిందని తీవ్రంగా వ్యాఖ్యానించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
‘దిశ’కు సంబంధించిన వస్తువుల్ని గుర్తించేందుకు నిందితులను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో విచారణ కోసం గెస్ట్హౌస్ (సేఫ్హౌస్)లో ఉంచారు. కానీ గెస్ట్హౌస్ మేనేజర్ అనిల్కుమార్ కమిషన్కు ఇచ్చిన వాంగ్మూలంలో.. మూడు రోజుల అద్దె కోసం పోలీసులు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. పోలీస్ రికార్డుల్లో మాత్రం అద్దె చెల్లించినట్లు ఎలాంటి రికార్డు లేదు. దీన్నిబట్టి సేఫ్హౌస్ను అద్దెకు తీసుకున్నారనేది అంగీకారయోగ్యంగా లేదు. నిందితులు ఇంకేమైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారా? అని తెలుసుకునేందుకు సేఫ్హౌస్కు తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. కానీ ఆశ్చర్యకరంగా.. వారిని తీసుకెళ్లిన 21 గంటల వరకూ ఏసీపీ అక్కడికి రాలేదు. కానీ కేస్డైరీలో ఏసీపీ విచారణ జరిపినట్లు ఉంది.
అనుమానాస్పదంగా ‘అయిదో కట్ట’
‘దిశ’ వస్తువుల్ని నిందితులు పెద్ద విద్యుత్తు స్తంభం సమీపంలో దాచినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. కానీ కమిషనర్ సజ్జనార్ మాత్రం నిందితులు వాటిని పొదల వెనక దాచారని మీడియా సమావేశంలో చెప్పారు.
* వస్తువులను దాచినట్లు చెప్పిన ‘అయిదో కట్ట’.. జాతీయ రహదారి-44 నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉంది. హైవే నుంచి నడవడానికి సరైన మార్గం లేని అక్కడికి చీకటివేళ వెళ్లి వస్తువుల్ని దాయడం అసాధ్యం. ఎన్కౌంటర్ ప్రాంతంపై సరైన స్కెచ్ గీయడంలో సాక్షులంతా విఫలమయ్యారు. ‘దిశ’ వస్తువుల్ని గుర్తుపట్టేందుకు రావాలని తమకు పోలీసులు ఎలాంటి సమన్లు జారీ చేయలేదని ఆమె సోదరి కమిషన్కు చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ జరిగిన మరుసటి రోజు ఆమెకు చూపించి ధ్రువీకరించుకున్నామన్నారు.
విరుద్ధ వాంగ్మూలాలు.. పొంతన లేని సమాధానాలు
తామిద్దరం ఎన్కౌంటర్ స్థలంలో ‘దిశ’ వస్తువుల్ని సేకరించేటప్పుడు ఉన్నట్లు పంచనామా సాక్షులు రాజశేఖర్, రవూఫ్.. అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన రోజు మధ్యాహ్నం 12.45కు సంఘటన స్థలంలోనే నిర్వహించిన పంచనామాలోనూ వారిద్దరినీ సాక్షులుగా పేర్కొన్నారు. కానీ ఉదయం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత సంఘటన స్థలం నుంచి వెళ్లిన తాము తిరిగి సాయంత్రం 6 గంటలకే ఘటనాస్థలికి వచ్చినట్లు వారిద్దరూ వాంగ్మూలంలో పేర్కొనడం పరస్పర విరుద్ధం.
* నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడినట్లు సిట్ ఇచ్చిన నివేదిక లోపాలమయం. ఇద్దరికి రక్తగాయాలయ్యాయని ఐపీఎస్ అపూర్వారావు పేర్కొన్నారు. మరో నివేదికలో మాత్రం ఒక్కరికే రక్తగాయాలైనట్లు ఉంది. నిందితుడు జొల్లు శివ కర్రతో పోలీసు అధికారి అరవింద్గౌడ్ను.. మరో నిందితుడు జొల్లు నవీన్ రాళ్లతో పోలీసు అధికారి వెంకటేశ్వర్లును కొట్టారని పోలీసుల తుది నివేదికలో ఉంది. ఒక నివేదికలో క్షతగాత్రుల్ని కేర్ ఆసుపత్రికి, మరో నివేదికలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారికి ఎక్స్రే లేదా సీటీ స్కాన్ చేసినట్లు కమిషన్కు కేర్ ఆసుపత్రి ఎలాంటి ఆధారాలివ్వలేదు. అరవింద్గౌడ్ భుజానికి గాయమైనట్లు రికార్డుల్లో ఉంటే.. కడుపు, మెదడులో సీటీస్కాన్ చేసినట్లు డిశ్ఛార్జి సమ్మరీలో పేర్కొన్నారు.
* నిందితుల దాడితో ఘటనాస్థలిలో స్పృహ కోల్పోయిన తాను కేర్ ఆసుపత్రిలోనే కళ్లు తెరిచానని అరవింద్గౌడ్ మెజిస్ట్రేట్కు తెలిపారు. కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం ఘటనాస్థలిలో అపస్మారక స్థితిలో ఉన్నా, కాల్పుల శబ్దం విన్నానని పేర్కొన్నారు.
ఆయుధాల వాడకంపై అవగాహన లేని వ్యక్తి పిస్టల్ లాక్కొని కాల్పులు జరపడం సాధ్యమవుతుందా అని ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలిచ్చారు. ఇదే విషయాన్ని బాలిస్టిక్ నిపుణులు ఎన్.బి.బందన్ను అడిగితే అసాధ్యమన్నారు. పిస్టల్ సేఫ్టీలాక్ ఆన్లో ఉందో లేదో దర్యాప్తు చేశారా అని సిట్ చీఫ్ మహేశ్భగవత్ను అడిగితే లేదన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాన్ని ఎలా అన్లాక్ చేశారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ను ప్రశ్నిస్తే అవి అప్పటికే అన్లాక్ చేసి ఉన్నట్లు షాద్నగర్ సీఐ తనకు చెప్పారన్నారు.
సిట్ నివేదిక లోపాల పుట్ట
నిందితులు పారిపోయేందుకు తమ కళ్లలో మట్టి, బురద కొట్టారని పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. కానీ పచ్చని చెట్లతో ఉన్న ఆ ప్రాంతంలో ఎంతో ప్రయత్నిస్తే గానీ మట్టిని తీయలేరు. 12 మంది సాయుధ పోలీసుల కళ్లలో మట్టికొట్టి దాడి చేయడం దాదాపు అసాధ్యం.
నిందితులు ఆయుధాలు లాక్కున్నారన్న ఆరోపణలు నమ్మశక్యం కానివి. పోలీసు బృందానికి నాయకత్వం వహించిన ఏసీపీ సురేందర్ అల్లిన కట్టుకథ. ఇద్దరు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నట్లు తాను చూశానని తొలుత సురేందర్ చెప్పారు. తర్వాత ఒకరి నుంచే అని మాట మార్చారు. ఒకే పిస్టల్ పౌచ్ను ఘటనాస్థలిలో వేర్వేరు ప్రదేశాల నుంచి పలుమార్లు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికల్లో పేర్కొనడం ఆశ్చర్యకరం.
పోలీసుల ‘స్కెచ్’ వాస్తవదూరం
నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు జరిపిన కాల్పుల్లోనే మరో ఇద్దరు నిందితులు మరణించి ఉండొచ్చనే వాదన వాస్తవదూరం. పోలీసుల నుంచి నిందితులు లాక్కున్న 9 ఎంఎం పిస్టల్ రౌండ్ల కారణంగా శివ, నవీన్కు గాయాలు కాలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చిచెప్పారు. శివ, నవీన్లకు వెనక వైపు ఆరిఫ్, చెన్నకేశవులు ఉన్నారు. కానీ శివ, నవీన్లను ముందు నుంచి కాల్చినట్లుగా నివేదికలు స్పష్టం చేశాయి.
* రెండు 9 ఎంఎం పిస్టళ్లు, ఒక ఏకే-47, రెండు ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో 41 రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నా ఘటన్థాలిలో కేవలం 19 ఖాళీ క్యాట్రిడ్జ్లు మాత్రమే లభ్యమయ్యాయి. మొత్తం క్యాట్రిడ్జ్లు దొరక్కపోయినా 41 రౌండ్ల కాల్పులు జరిగాయని నిర్ధారణకు రావడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
* ఎన్కౌంటర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానానికి పంపించడంలో కావాలనే తాత్సారం చేశారు. పోలీసు కాల్పుల్లో ప్రాణనష్టం సంభవిస్తే అత్యవసరంగా టెలిగ్రామ్, రేడియోగ్రామ్, ఈ మెయిల్, ఫ్యాక్స్ లాంటి సాధనాల ద్వారా జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు సమాచారం చేరవేయాలని పోలీస్ మాన్యువల్లో ఉన్నా ఆలస్యం చేశారు.
నలుగురినీ చంపాలనేదే వారి ఉద్దేశం
నిందితులు నలుగురూ ఆయుధాలు లాక్కొని పారిపోవడం.. పోలీసులపై దాడికి దిగడం లాంటివి చేయలేదని భావిస్తున్నాం. ఎన్కౌంటర్పై పోలీసులు చెబుతున్న వాదనకు అర్థం లేదు. నిందితుల ప్రాణాలు తీయాలనే ఉద్దేశం పోలీసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
* వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్మదార్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్గౌడ్, డి.జానకిరాం, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్లపై సెక్షన్ 302 రెడ్విత్ 34 ఐపీసీ, 201 రెడ్విత్ 302 ఐపీసీ, 34 ఐపీసీ సెక్షన్లు నమోదు చేసి విచారించాలి. వీరందరి ఉమ్మడి ఉద్దేశం నలుగురు నిందితులను హతమార్చడమేనని పేర్కొంటూ కమిషన్ తన నివేదికలో పలు సంఘటనలను ఉదహరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం