Andhra News: మదనపల్లెలో కిలో టమాటా రూ.88

అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధర అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం గరిష్ఠంగా కిలో రూ.88 వరకు పలికింది. ఈ సీజన్‌లో మార్చి

Updated : 21 May 2022 09:26 IST

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధర అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం గరిష్ఠంగా కిలో రూ.88 వరకు పలికింది. ఈ సీజన్‌లో మార్చి నెలాఖరులో తక్కువగా ఉన్న ధరలు వారం రోజులుగా పుంజుకుంటున్నాయి. మార్కెట్‌కు సరకు తక్కువగా వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం రైతులు 155 టన్నులు మాత్రమే తీసుకొచ్చారు. ఈ సీజన్‌లో రోజూ 700 టన్నుల నుంచి 900 టన్నుల వరకు రావాల్సి ఉండగా, దిగుబడి తగ్గడంతో రైతులు తక్కువగా తీసుకొస్తున్నారు. మదనపల్లె మార్కెట్‌ నుంచి విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, తమిళనాడులోని చెన్నై, కుంభకోణం, కేరళ రాష్ట్రంలోని పలు నగరాలకు టమాటాలను ఎగుమతి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని