పెట్రో ధరల తగ్గింపు
మాకు అన్నింటి కంటే ప్రజలే ముఖ్యం. ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి. విభిన్న రంగాలపై అది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కల్గించి, జీవనాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఉజ్వల పథకం కోట్ల మంది ప్రజలకు,
పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకంలో కోత
ఆ రెండు ఇంధనాల ధరలు లీటర్కు వరుసగా రూ.8, రూ.6 చొప్పున తగ్గింపు
మొత్తంమీద తగ్గే భారం రూ.9.50, రూ.7
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటన
రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలని పిలుపు
ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్పై రూ.200 రాయితీ
ప్లాస్టిక్, ఉక్కు ఉత్పత్తుల ముడి సరకులపైనా కస్టమ్స్ సుంకం తగ్గింపు
మాకు అన్నింటి కంటే ప్రజలే ముఖ్యం. ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి. విభిన్న రంగాలపై అది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కల్గించి, జీవనాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఉజ్వల పథకం కోట్ల మంది ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మేలు చేసింది. ఉజ్వల గ్యాస్ రాయితీపైౖ తీసుకున్న నిర్ణయం కుటుంబాల బడ్జెట్ను సరళతరం చేస్తుంది.
- ట్విటర్లో ప్రధాని నరేంద్ర మోదీ
ఈనాడు, దిల్లీ: అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనపు జల్లును కురిపించింది. నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసింది. లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం సాయంత్రం ట్విటర్ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ఎక్సైజ్ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని పేర్కొన్నారు. కేంద్రం మాదిరిగానే రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్పై పన్నులను తగ్గించాలని ఆమె సూచించారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ప్రకటించారు. ప్లాస్టిక్, ఉక్కు ఉత్పత్తులకు అవసర ముడిసరకులు, ఉపకరణలపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. సిమెంటు లభ్యతను పెంచడంతో పాటు దాని ధర తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏడు నెలల్లో రెండోసారి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు గతంలో ఎన్నడూలేని స్థాయికి చేరడంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతూ వస్తోంది. దానివల్ల టోకు ద్రవ్యోల్బణం 15.08శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం 7.79%కి చేరి ఎనిమిదేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. సిమెంటు, స్టీల్ ధరలు పెరిగి గృహ నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉపాధి కల్పన కుదించుకుపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
* గత ఏడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు రూ.8, రూ.6 చొప్పున కోత వేసింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్పై రూ.19.9, డీజిల్పై రూ.15.8 చొప్పున ఎక్సైజ్ సుంకం అమల్లో ఉంటుంది.
* 2020లో గరిష్ఠంగా లీటర్ పెట్రోల్పై రూ.32.9, డీజిల్పై రూ.31.8 ఎక్సైజ్ సుంకం అమల్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ రూ.13., డీజిల్పై రూ.16 తగ్గించినట్లయింది.
* కేంద్ర ప్రభుత్వ తాజా పిలుపునకు కేరళ రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించింది. తమ రాష్ట్రంలో లీటరు పెట్రోల్పై విధిస్తున్న పన్నులో రూ.2.41, డీజిల్పై విధిస్తున్న పన్నులో రూ.1.36 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
కష్టకాలంలోనూ సంక్షేమ పథం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అంకితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రధాని మోదీ హామీలను దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలను ఆదుకోవడానికి మరికొన్ని చర్యలు ప్రకటిస్తున్నాం. ఇందులో భాగమే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి. గత ఏడాది నవంబరులో పెట్రో ఉత్పత్తి ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇప్పుడైనా సామాన్యుడికి ఉపశమనం కల్పించాలి. ఈ ఏడాది 9 కోట్ల మంది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ఇస్తాం. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.6,100 కోట్ల భారం పడుతుంది. దిగుమతులపై అత్యధికంగా ఆధారపడిన ప్లాస్టిక్ ఉత్పత్తుల ముడిసరకు, ఉపకరణలపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నాం. ఇనుము, ఉక్కు ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి వాటి ముడి సరకుపైనా కస్టమ్స్ సుంకాలను సవరిస్తున్నాం. సిమెంట్ లభ్యతను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. సరైన లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి సిమెంట్ ధరలను తగ్గిస్తాం. సంబంధిత నోటిఫికేషన్లు వెంటనే జారీచేస్తాం’’ అని నిర్మలాసీతారామన్ తెలిపారు. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని ప్రశంసించారు. భాజపాయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
తగ్గింపు కంటితుడుపు చర్యే: కాంగ్రెస్
ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన పెట్రో ధరల తగ్గింపు కంటి తుడుపు చర్య మాత్రమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సూర్జేవాలా విమర్శించారు. ‘గత 60 రోజుల్లో లీటర్ పెట్రోల్పై రూ.10 పెంచి రూ.9.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డీజిల్ ధర విషయంలోనూ 60 రోజుల్లో రూ.10 పెంచి ఇప్పుడు రూ.7 తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రజలను వెర్రివాళ్లను చేయడం మానేయండి. 2014 మే స్థాయికి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించండి. మోసం చేయడం మానేసి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ధైర్యం చేయండి’’ అని డిమాండ్ చేశారు.
వసూలు చేసేది కొండంత... ఇచ్చేది పిసరంత
బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే
రాష్ట్రాలకు పంచుతున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పేరుతో భారీగా వసూలు చేస్తున్నా, పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు తిరిగిచ్చేది మాత్రం స్పల్పంగా ఉంటోంది. తాజాగా పెట్రోల్పై లీటర్కు రూ.8, డీజిల్పై రూ.6 తగ్గించడంతో వాటిపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ వరుసగా రూ.19.90, రూ.15.80కి తగ్గిపోయింది. వాస్తవంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా ప్రకారం ఇందులో 41% రాష్ట్రాలకు రావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డ్యూటీని బేసిక్, స్పెషల్ అడిషినల్, అడిషినల్ ఎక్సైజ్డ్యూటీల పేరుతో మూడు వేర్వేరు విభాగాల కింద విభజించింది. ఇందులో పెట్రోల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద లీటర్కు రూ.1.40, డీజిల్పై రూ.1.80 వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని మాత్రమే పన్ను వాటా కింద రాష్ట్రాలకు పంచుతోంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నామని, ప్రస్తుతం ఇది పెట్రోల్పై రూ.1.40, డీజిల్పై రూ.1.80 మాత్రమే ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,71,908 కోట్లు వచ్చినా అందులో రాష్ట్రాలకు రూ.19,972 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. అంటే మొత్తం వసూలైన సుంకాల్లో రాష్ట్రాలకు దక్కింది 5.37% మాత్రమే. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె