45 మంది విద్యార్థులకు ఒక టీచర్
రాష్ట్రంలో 3, 4, 5 తరగతులుండే ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో 45 మంది విద్యార్థులకు ఒక టీచర్నే ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 45 నుంచి 74 మంది విద్యార్థులు ఉంటే తప్ప మరో టీచర్ను ఇవ్వరు. ప్రాథమిక విద్య ఆయువు తీసేలా ఈ నిర్ణయం ఉందని
పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల మ్యాపింగ్కు ఆదేశాలు జారీ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 3, 4, 5 తరగతులుండే ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో 45 మంది విద్యార్థులకు ఒక టీచర్నే ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 45 నుంచి 74 మంది విద్యార్థులు ఉంటే తప్ప మరో టీచర్ను ఇవ్వరు. ప్రాథమిక విద్య ఆయువు తీసేలా ఈ నిర్ణయం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక విద్యను ప్రభుత్వం విద్యార్థులకు దూరం చేస్తోందని, ఇంతమంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ పాఠాలను ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 52 మంది, ఉన్నత పాఠశాలల్లో 60 మంది వరకు విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉంటారు. నిర్ణీతం కంటే ఫౌండేషన్ ప్లస్లో 30, ప్రాథమికోన్నతలో 35, ఉన్నత పాఠశాలల్లో 39 మంది విద్యార్థులు అదనంగా ఉంటే ఆ తర్వాత రెండో టీచర్ను ఇస్తారు. ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రాథమికోన్నత బడులకు మంగళం
ఉన్నత పాఠశాలల్లో సరైన వసతి సౌకర్యం ఉంటే మూడు కిలోమీటర్ల లోపున్న ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను తరలిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో భవిష్యత్తులో ఫౌండేషన్ బడులు, ఉన్నత పాఠశాలలే మిగలనున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ఆరు రకాల బడులు అని చెబుతున్నా ఈ నిర్ణయాలతో 3-10 వరకు తరగతులు కలిగిన ఉన్నత పాఠశాలలు... పూర్వ ప్రాథమిక విద్య-1, 2, ఒకటి, రెండు తరగతులు ఉండే ఫౌండేషన్ బడులు... ఇలా 2 రకాలే ఉంటాయి.
* అన్ని సబ్జెక్టులను ఉర్దూ మాధ్యమంలో బోధిస్తూ, సమ్మెటివ్-2 పరీక్షలను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించే బడులను కొనసాగిస్తారు. మిగతా వాటిని సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తారు. ఇక్కడ మొదటి భాషగా ఉర్దూను బోధిస్తారు. ఈ నిర్ణయంతో ఉర్దూ, ఇతర మైనర్ మాధ్యమాలు కనుమరుగు కానున్నాయి. రాష్ట్రంలో దాదాపు ఎక్కడా ఉర్దూ అంగన్వాడీలు లేవు. అన్నీ ఆంగ్ల మాధ్యమంగా మారితే ఉర్దూ అభ్యసించే వారుండరు.
3 నుంచి 8 వరకు ఒక్కటే మాధ్యమం
మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒకే మాధ్యమంగా పరిగణిస్తారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగిస్తారు. ఒకే మాధ్యమంగా పరిగణించి, ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 3-8 తరగతుల్లో తెలుగు మాధ్యమం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.