PM Modi: ఇండో-పసిఫిక్లో శాంతికి బాటలు
అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు ఇండో-పసిఫిక్ ప్రాంతం కేంద్ర బిందువని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత్ కొన్ని శతాబ్దాల పాటు ప్రధాన కేంద్రంగా కొనసాగిందని గుర్తుచేశారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ ప్రాంతమే కేంద్ర బిందువు: ప్రధాని మోదీ
అమెరికా నేతృత్వంలో ఇండో-పసిఫిక్ ఆర్థిక చట్రం ఆవిర్భావం
సభ్య దేశంగా భారత్
టోక్యో: అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు ఇండో-పసిఫిక్ ప్రాంతం కేంద్ర బిందువని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత్ కొన్ని శతాబ్దాల పాటు ప్రధాన కేంద్రంగా కొనసాగిందని గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ఇంజిన్గా మార్చాలన్న ఉమ్మడి లక్ష్యంతో ఆవిర్భవించిన ‘ఇండో-పసిఫిక్ ఆర్థిక చట్రం (ఐపీఈఎఫ్)’కు సమగ్ర రూపమిచ్చేందుకు తాము కృషిచేస్తామని ఉద్ఘాటించారు. తద్వారా ఇక్కడ శాంతి, సౌభాగ్యాలకు బాటలు పరుస్తామని భరోసా ఇచ్చారు. టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదలతో కలిసి ఐపీఈఎఫ్ ఆవిర్భావాన్ని ప్రకటించిన మోదీ.. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఐపీఈఎఫ్లో భారత్ భాగస్వామిగా చేరినట్లు తెలిపారు. ఇండో-పసిఫిక్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాలను కనుగొనాలని మోదీ పిలుపునిచ్చారు. విశ్వాసం (ట్రస్ట్), పారదర్శకత (ట్రాన్స్పరెన్సీ), సమయానుకూలత (టైమ్లీనెస్) అనే మూడు ‘టి’లను మూలస్తంభాలుగా చేసుకుంటూ సమర్థ సరఫరా గొలుసులను ఏర్పాటుచేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ రంగం, ఆర్థిక కార్యకలాపాలకు ఇండో-పసిఫిక్ ప్రాంతమే కేంద్రం. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత్ శతాబ్దాల పాటు ప్రధాన కేంద్రంగా ఉందన్న వాస్తవాన్ని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన వాణిజ్య ఓడరేవు గుజరాత్లోని లోథాల్లో ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. ఐపీఈఎఫ్కు శ్రీకారం చుట్టినందుకు బైడెన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ ఉమ్మడి లక్ష్యాలను సాధించడంపై ఐపీఈఎఫ్ భాగస్వామ్య దేశాలు త్వరలోనే సంప్రదింపులు ప్రారంభిస్తాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, భారత్-అమెరికా సరికొత్త ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశాయి.
చైనా దూకుడుకు కళ్లెం వేసేలా..
ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 12 దేశాలతో ఉమ్మడి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఐపీఈఎఫ్కు అమెరికా రూపకల్పన చేసింది. అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేసియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ఇందులో సభ్యదేశాలు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వీటి వాటా దాదాపు 40%. ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు ఐపీఈఎఫ్ దోహదపడనుంది. కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వంటి ఒడుదొడుకులను అధిగమించి తిరిగి స్థిరత్వాన్ని సాధించేందుకు.. ఆర్థిక రంగంలో భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసే బలమైన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఐపీఈఎఫ్కు అమెరికా శ్రీకారం చుట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మాంద్యం అనివార్యమేమీ కాదు: బైడెన్
అమెరికా ఆర్థిక వ్యవస్థను పలు సమస్యలు పీడిస్తున్న మాట వాస్తవమేనని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే తమ దేశంలో ఆర్థిక మాంద్యం అనివార్యమేమీ కాదని.. పలు ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ఐపీఈఎఫ్తో సభ్యదేశాలకు పలు ప్రయోజనాలు ఒనగూరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు- అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రమాదకర మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. కొవిడ్ తరహాలో కఠిన క్వారంటైన్ ఆంక్షలు విధించాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని అభిప్రాయపడ్డారు. టోక్యోలో ఈ మేరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?