జనంపై మరో పిడుగు
అన్ని రకాల ఖర్చులు పెరిగి అల్లాడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. మట్టి మిద్దెల నుంచి.. ఆకాశహర్మ్యాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువలను పెంచేసింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా వడ్డించింది.
నిర్మాణాల మార్కెట్ విలువ సగటున 5% పెంపు
మట్టి మిద్దె నుంచి ఆకాశహర్మ్యాల వరకూ దేన్నీ వదలలేదు
పూరిళ్లపైనా చదరపు అడుగుకు రూ.10 అదనపు బాదుడు
ప్రజలపై ఏటా రూ.125 కోట్లకు పైగా భారం
ఈనాడు, అమరావతి : అన్ని రకాల ఖర్చులు పెరిగి అల్లాడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. మట్టి మిద్దెల నుంచి.. ఆకాశహర్మ్యాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువలను పెంచేసింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా వడ్డించింది. తాటాకు, కొబ్బరాకులు, రెల్లుగడ్డితో కప్పే గుడిసెలపైనా చదరపు అడుగుకు అదనంగా రూ.10 చొప్పున బాదేసింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా.. ప్రస్తుత విలువలపై సగటున 5% చొప్పున పెంచడం వల్ల ప్రజలపై ఏటా రూ.125 కోట్లకు పైగా భారం పడనుంది. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు మేజర్ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోనూ పెరిగిన విలువలపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. దీంతో చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలనుకునే పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు.. ఫ్లాట్ కొనుక్కుందామని ఆశపడే ఉద్యోగ, వ్యాపార వర్గాలపైనా అదనంగా (1500 చదరపు అడుగులకు) సగటున రూ.6 వేల పైనే భారం పడుతుంది. భవన నిర్మాణాల రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగే పట్టణ ప్రాంతాలు, మేజర్ పంచాయతీల పరిధిలో ఎక్కువ మొత్తంలో పిండేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపుదల జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. సాధారణంగా నిర్మాణాల కొత్త మార్కెట్ విలువలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచింది. ఇప్పుడు నిర్మాణాల మార్కెట్ విలువలూ పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడనుంది.
చదరపు అడుగుకు రూ.40- రూ.60 వరకు పెంపు
* పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని నిర్మాణాలపై చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న విలువపై గరిష్ఠంగా రూ.60 వరకు పెంచారు.
* మేజర్ పంచాయతీల పరిధిలోని నిర్మాణాలపైనా గరిష్ఠంగా రూ.60 వరకు బాదుడు కొనసాగించారు.
* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలపై చ.అ.కు రూ.40 చొప్పున పెంచారు.
* మూడో అంతస్తు నుంచి పైన ఉండే నిర్మాణాలకు గతంలో చ.అడుగుకు పట్టణ ప్రాంతాల్లో రూ.1,240 ఉండగా దాన్ని రూ.1,300 చేశారు.
* మేజర్ పంచాయతీల్లో రూ.1,140 నుంచి రూ.1,200, గ్రామీణ ప్రాంతాల్లో రూ.530 నుంచి రూ.560 చేశారు.
* మూడువైపులా ఉమ్మడి గోడలు లేని అపార్ట్మెంట్ నిర్మాణాలపై చదరపు అడుగుకు పట్టణ ప్రాంతాల్లో గతంలో రూ.1,240 ఉంటే ఇప్పుడు రూ.1,300 చేశారు.
* సిమెంటు రేకులు, నాపరాతి నిర్మాణాలకు సంబంధించి పట్టణ ప్రాంతాలు, మేజర్ పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ.30, గ్రామాల్లో రూ.20 చొప్పున పెరిగింది.
* చవిటి మిద్దెలకు చదరపు అడుగుకు పట్టణ ప్రాంతాల్లో రూ.370 నుంచి రూ.390కి, మేజర్ పంచాయతీల్లో రూ.280 నుంచి రూ.290కి, గ్రామాల్లో రూ.210 నుంచి రూ.220కి పెంచారు.
* అసంపూర్తి నిర్మాణాలు పునాది స్థాయిలో ఉంటే 25%, స్లాబ్ స్థాయిలో 65%, పూర్తయ్యే దశలో 85% చొప్పున వసూలు చేస్తారు.
ప్రజలపై ఆర్థిక భారం ఇలా..
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో.. స్థలం విలువతో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
బస్సులు సీఎం సభకు.. కష్టాలు ప్రయాణికులకు
ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రయాణికులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
మూడు రాజధానులు ఏర్పాటు చేశాం
‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కరవును కళ్లారా చూడు జగనన్నా
‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్