Andhra News: పింఛను ఆగిందా.. అది మీ తలరాత!: ఎమ్మెల్యే విచిత్ర వ్యాఖ్య

దివ్యాంగురాలైన తమ కుమార్తె పింఛన్‌ను రద్దు చేశారని వాపోయిన ఓ తల్లితో విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు విచిత్రంగా మాట్లాడారు. ‘పింఛను ఆగిందా.. అయితే అది మీ తలరాత’ అని వ్యాఖ్యానించారు.

Updated : 26 May 2022 08:16 IST

బాడంగి, న్యూస్‌టుడే: దివ్యాంగురాలైన తమ కుమార్తె పింఛన్‌ను రద్దు చేశారని వాపోయిన ఓ తల్లితో విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు విచిత్రంగా మాట్లాడారు. ‘పింఛను ఆగిందా.. అయితే అది మీ తలరాత’ అని వ్యాఖ్యానించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా బుధవారం ఆయన బొబ్బిలి మండలం వాడాడలో పర్యటించగా ఈ సంఘటన జరిగింది. ‘మా పాపకు రెండేళ్ల క్రితం వరకు రూ.3 వేల పింఛను వచ్చేది. తెదేపా సానుభూతిపరులమన్న కారణంగా కొన్ని నెలలుగా ఇవ్వడం లేదు. కారణమడిగితే 5 విద్యుత్తు మీటర్లు ఉన్నాయని చెబుతున్నారు. మేం అద్దె ఇంట్లో ఉంటున్నాం. పూర్తి వివరాలు, సంబంధిత ధ్రువపత్రాలను విద్యుత్‌శాఖ, సచివాలయంలో అందించాం. అయినా ఎవరూ స్పందించడం లేదు’ అని బాధితురాలి తల్లిదండ్రులు అరుణకుమార్‌, పంచముఖేశ్వరరావు ఎమ్మెల్యే వద్ద వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని