అత్యంత సంపన్నుడు ‘బీద’
రాజ్యసభకు వైకాపా తరఫున నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలతోపాటు నమోదైన కేసుల వివరాలను ఎన్నికల సంఘానికి బుధవారం
ఆర్.కృష్ణయ్యకు అతి తక్కువ ఆస్తులు..
విజయసాయిపై 19 కేసులు
ఈనాడు, అమరావతి: రాజ్యసభకు వైకాపా తరఫున నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలతోపాటు నమోదైన కేసుల వివరాలను ఎన్నికల సంఘానికి బుధవారం అఫిడవిట్ రూపంలో సమర్పించారు. వాటిలో పొందుపరచిన వివరాల ప్రకారం.. ఎంపీ విజయసాయిరెడ్డిపై 8 ఈడీ, 11 సీబీఐ కేసులున్నాయి. నలుగురు అభ్యర్థులూ కోటీశ్వరులే. వీరిలో బీద మస్తాన్రావు కుటుంబ ఆస్తుల విలువ అత్యధికంగా రూ.243 కోట్లుండగా.. బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన ఆస్తుల విలువను రూ.3.50 కోట్లుగా పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడుగా (ఎ-2) ఉన్న విజయసాయిరెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు- 8, సీబీఐ కేసులు- 11 ఉన్నాయి. వాటిలో ఆయన ప్రస్తుతం న్యాయ విచారణ ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతోపాటు నేరపూరిత కుట్ర, మోసం తదితర సెక్షన్ల కింద ఆయనపై కేసులున్నాయి. తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 21.57 కోట్లుగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర, నివాస భవనాల విలువ రూ. 21.42 కోట్లుగా ఉంది. భార్య సునందారెడ్డివద్ద 1,456 గ్రాముల బంగారం, రూ.2.90 కోట్ల విలువైన వజ్రాలున్నాయి. రూ.24.65 లక్షల రుణాలున్నాయి.
బీద మస్తాన్రావు
బీద మస్తాన్రావు కుటుంబానికి రూ.243 కోట్ల ఆస్తులు, రూ.85 కోట్ల అప్పులున్నాయి. ఇందులో స్థిరాస్తుల విలువ రూ.93 కోట్లు, చరాస్తుల విలువ రూ. 150 కోట్లుగా తెలిపారు. తన పేరుతో రూ.120.72 కోట్లు, భార్య మంజుల పేరుతో 19.85 కోట్లు, హిందూ అవిభాజ్య కుటుంబం కింద తన పేరుతో రూ. 9.43 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.93 కోట్ల విలువైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య భవనాలున్నాయి. 7,597 గ్రాముల బంగారం, 7,825 గ్రాముల వెండితోపాటు వజ్రాల విలువ రూ.8.02 కోట్లుగా పేర్కొన్నారు. ఎగుమతి పన్నులకు సంబంధించి న్యాయ వివాదంలో ఉన్న రూ. 16.21 కోట్ల అప్పులు, బ్యాంకు రుణాలుగా రూ.69 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
నిరంజన్రెడ్డి
న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి మొత్తం తమ కుటుంబ స్థిర, చరాస్తుల విలువను రూ.75.91 కోట్లుగా, బ్యాంకు రుణాలను రూ.10.99 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.32.48 కోట్లు, భార్య వైదేహిరెడ్డి పేరుతో రూ.9.17 కోట్లు, తన పేరుతో హిందూ ఉమ్మడి అవిభాజ్య కుటుంబం కింద రూ.67.07 లక్షలు, కుమార్తె అక్షరరెడ్డి పేరుతో 1.13 కోట్ల విలువైన చరాస్తులున్నాయని వెల్లడించారు. ఇందులో 4,273 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. తన పేరుతో బీఎండబ్ల్యూ, ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, భార్య పేరుతో మెర్సిడెస్ బెంజ్ కార్లున్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వారసత్వంగా వచ్చిన భూమి విలువ రూ.14.04 కోట్లు, తన పేరుతో రూ.15.81 కోట్లు, భార్య పేరుతో రూ.3.01 కోట్లు, తన పేరుతో హిందూ అవిభాజ్య కుటుంబం కింద రూ.4.72 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. తన పేరుతో సాగర్ కన్వెన్షన్ బిజినెస్ సెంటర్లో 70% వాటా, భార్య వైదేహిరెడ్డి పేరుతో నిరంజన్ అసోసియేట్స్ ఎల్ఎల్పీలో 34% వాటాలున్నాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ చిరునామాగా పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్లో వివరించారు.
ఆర్.కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడిగా వైకాపా తరఫున నామినేషన్ వేసిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన కుటుంబ ఆస్తుల విలువ రూ.3.50 కోట్లుగా, రుణాలు రూ.39.26 లక్షలుగా పేర్కొన్నారు. తన పేరుతో ఇన్నోవా కారు, భార్య పేరుతో మరో కారు ఉన్నట్లు వివరించారు. భార్య శబరి వద్ద రూ.14 లక్షల విలువైన 280 గ్రాముల బంగారం, తనవద్ద రూ.2 లక్షల విలువైన 40 గ్రాముల బంగారం ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తన పేరుతో రూ. 1.05 కోట్లు, భార్య పేరుతో రూ.1.95 కోట్ల విలువైన నివాస భవనాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయని వివరించారు. వివాదంలో ఉన్న ప్రభుత్వ అప్పుల విలువ రూ.43.86 లక్షలుగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.