MLC Ananthababu: అడ్డొచ్చినవారిని తొక్కి.. అడ్డగోలుగా ఎదిగి
తన మాజీ డ్రైవరు, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంత బాబు) రంపచోడవరం ఏజెన్సీలో నియంతలా
మన్యం అడ్డాగా అనంత బాబు అక్రమాలకు లెక్కే లేదు
ఏజెన్సీలో నియంతలా మారిన వైకాపా ఎమ్మెల్సీ
గిరిజనుల పథకాలూ తన సామాజికవర్గానికే
మాట వినకపోతే బెదిరింపులు, దౌర్జన్యాలు
ఈనాడు డిజిటల్, పాడేరు: తన మాజీ డ్రైవరు, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంత బాబు) రంపచోడవరం ఏజెన్సీలో నియంతలా వ్యవహరించేవాడన్న విషయం ఇప్పుడు మన్యం దాటి అంతటా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అర్హులైన గిరిజనులున్నా వారికి పదవులు దక్కనీయకుండా తన సామాజిక వర్గానికే కట్టబెట్టేవాడని, మాట విననివారిని ప్రలోభపెట్టో.. బెదిరించో దారికి తెచ్చుకునేవాడని పలువురు చెబుతున్నారు. తన అనుచరులు ఎలాంటి తప్పుడు పని చేసినా కొమ్ముకాసే నైజం అనంతబాబును మన్యంలో బలమైన శక్తిగా మార్చిందన్నది కాదనలేని వాస్తవం. ఆరు నెలల క్రితం తన కాన్వాయ్కు అడ్డొచ్చారని గోకవరం డిపో బస్సు డ్రైవర్ను అనంతబాబు అనుచరులు కొట్టడంతో రంపచోడవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు రాజీకి వచ్చి కేసు నుంచి బయటపడ్డారు. ఇటీవల నర్సీపట్నం నుంచి మారేడుమిల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ను తన అనుచరులతో కొట్టించిన సంఘటన వెలుగుచూసింది. ఈ దాడిని ఫొటోలు తీసిన ప్రయాణికులను బెదిరించి వాటిని తొలగించారంటే అనంత అక్కడి ప్రజలను ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సొంత పార్టీలోవారే చెబుతున్నారు. అనంతబాబుపై సుమారు 12 కేసులు ఉండేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎత్తేయించుకున్నట్ల్లు సమాచారం.
మన్యంలో మాయలు
పోలవరం ప్రాజెక్టు భూములకు బినామీలను సృష్టించి దొంగ డి-పట్టాలతో రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో అనంతబాబు హస్తం ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇలా దొంగ పట్టాలతో గుబ్బలంపాడులో రూ.3.49 కోట్లు కాజేసిన ఘటన వెలుగుచూసింది.
* అనంతబాబు ప్రధాన అనుచరుడు ఒకరు రైతులకు రుణాల కింద చెల్లించాల్సిన సొమ్ము రూ.25 కోట్లను బినామీల పేరుతో కాజేశారు. ఈ కేసును అధికార బలంతో సెటిల్మెంటు చేసుకొని బయటపడినట్లు ఆరోపణలున్నాయి.
* ఎల్లవరంలో ఎల్లేపల్లి భద్రం అనే వ్యక్తి నుంచి 40 ఎకరాల భూమి కొని, దాని పక్కనున్న కొండ ప్రాంతానికి చెందిన మరో 25 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు.
* గొంటువానిపాలెంలో ఓ వ్యక్తికి చెందిన వంద ఎకరాల భూమిలో దౌర్జన్యంగా చేపల చెరువులను తవ్వించి, మద్దిగడ్డ జలాశయం నుంచి రైతులకు వెళ్లాల్సిన సాగునీటిని దౌర్జన్యంగా తన పొలాలకు, చేపల చెరువులకు మళ్లించుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి ఏలేశ్వరం, యర్రవరం తదితర ప్రాంతాల్లో విక్రయించే దందాలోనూ అనంత బాబుదే కీలకపాత్ర అని చెబుతుంటారు.
* ఇటీవల గంజాయి తరలిస్తూ చిక్కిన రంపచోడవరం పంచాయతీ వార్డు సభ్యుడు, వైకాపా నాయకుడు కృష్ణారెడ్డి కార్యకలాపాలకు అనంత బాబు ప్రోత్సాహం ఉందని స్థానికులు అంటున్నారు.
అనంత బాబుకు భయపడి అజ్ఞాతంలోకి..
గతంలో అనంత బాబుకు కిషోర్ అనే వ్యక్తి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. 2014లో ఎమ్మెల్యేగా వంతల రాజేశ్వరి గెలిచినా నియోజకవర్గ వ్యవహారాలన్నీ అనంత బాబే చూసుకునేవారు. అతని అక్రమాలను కిషోర్ ఎమ్మెల్యే రాజేశ్వరికి చెప్పేవారు. ఇది తెలిసి అనంత బాబు ఓసారి కిషోర్ను అందరి ముందు కొట్టారు. దీంతో రాజేశ్వరిని కిషోరే 2017లో తెదేపాలో చేర్పించాడు. అప్పటి నుంచి అతనిపై అనంతబాబు పగ పెంచుకున్నాడని అనుచరులు చెబుతున్నారు. 2019లో తెదేపా నుంచి రాజేశ్వరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాక.. ఇక్కడుంటే ప్రమాదమని కిషోర్ ప్రాణరక్షణ కోసం వేరేచోటకు వెళ్లిపోయాడని తెదేపా నేతలు చెబుతున్నారు.
* మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులో అనంతబాబు 20 రోజుల పాటు పరారై బెయిలు తెచ్చుకున్నాక బయటకు వచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు