పాలకులుగా బలహీనవర్గాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిగా ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’లో తమ ప్రభుత్వ విధానాన్ని, సీఎం జగన్ మోహన్రెడ్డి పరిపాలన, పార్టీ అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకెళతామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన
అదే వైకాపా లక్ష్యం
మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి
శ్రీకాకుళం నుంచి సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభం
పాల్గొన్న 16 మంది మంత్రులు
పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపుతో ప్రజలకు ఇబ్బందులు
విజయనగరంలో భారీ వర్షంతో సభ రద్దు
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, అరసవల్లి, లావేరు గ్రామీణం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిగా ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’లో తమ ప్రభుత్వ విధానాన్ని, సీఎం జగన్ మోహన్రెడ్డి పరిపాలన, పార్టీ అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకెళతామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా నుంచి గురువారం ప్రారంభమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. బలహీనవర్గాల ప్రజలు పాలకులుగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. యాత్రలో మొత్తం 16 మంది మంత్రులు పాల్గొన్నారు. వారిలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజు, కె.నారాయణస్వామి, తానేటి వనిత, అంజాద్ బాషా, బి.రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, విడదల రజిని, ఉషశ్రీ చరణ్ ఉన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ రాలేదు. తొలుత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రులు దర్శించుకున్నారు. ఏడు రోడ్ల కూడలిలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, స్పీకర్ తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయనతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున ప్రసంగించారు.
సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది: ధర్మాన
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి వాలంటీర్ నుంచి రాజ్యసభ సభ్యుల వరకు ఎక్కడ చూసినా, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది అని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలకు రూ.1.22 లక్షల కోట్ల విలువైన పథకాలు చేరవేశామని, ఇవి తమకు అందలేదని అర్హులైనా వారిలో ఏ ఒక్కరు చెప్పినా వారికి పారితోషికం ఇస్తానన్నారు. పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ కేబినెట్ కూర్పు నుంచి చిన్న చిన్న పదవుల వరకూ వెనుకబడినవర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారన్నారు. బస్సు యాత్రను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 17 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కులాలకు చెందిన వారిని మంత్రులను చేయడం మునుపెన్నడు జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు తగలపెట్టాలని చూస్తున్నారని, ఆయనతో పాటు తెదేపా నాయకులను మన పల్లెలకు రానీయవద్దన్నారు. తమ మధ్య గొడవలు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
మహిళలు అండగా నిలవాలి
చిలకపాలెం కూడలి, రణస్థలం వద్ద జాతీయ రహదారిపై మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, విడదల రజిని ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో అత్యధిక మంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని, మహిళలు వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి మరో 30 ఏళ్ల పాటు కొనసాగుతారని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ బస్సుయాత్ర జాతీయ రహదారిలో చిలకపాలెం, రణస్థలం, పైడి భీమవరం, నాతవలస మీదుగా సాయంత్రానికి విజయనగరం చేరుకుంది.
ఆంక్షలతో జనాలకు చుక్కలు
బస్సు యాత్ర నేపథ్యంలో శ్రీకాకుళం నగరంతో పాటు 16వ నంబరు జాతీయ రహదారిపై పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులతో జనాలకు చుక్కలు కనిపించాయి. శ్రీకాకుళంలో సన్రైజ్ హోటల్ నుంచి ఏడురోడ్ల కూడలికి వచ్చే కళింగరోడ్డులో ఉదయం నుంచే గంటల తరబడి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మంత్రులు తానేటి వనిత, విడదల రజిని వాహనాలూ చిక్కుకుపోవడంతో ఏడురోడ్ల కూడలి వరకూ వారు నడుచుకుంటూ వెళ్లారు. ఈ మార్గంలో దుకాణాలనూ పోలీసులు మూయించేశారు. రణస్థలం చేరుకున్న తరువాత అక్కడ సుమారు రెండు గంటల పాటు దాదాపు అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపివేశారు. అంబులెన్సులూ మధ్యలో ఉండిపోయాయి. వాహనాలు, బస్సుల్లో ప్రయాణించే వారంతా పిల్లాపాపలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అధికార పార్టీ నాయకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీల తరలింపు
షెడ్యూల్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకే ఏడురోడ్ల కూడలికి మంత్రుల బృందం చేరుకోవాల్సి ఉంది. అప్పటికి అనుకున్న స్థాయిలో జనాలు రాకపోవడంతో ఆలస్యం చేశారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలను ఆటోలు, ట్రాక్టర్లు బస్సుల్లో తరలించారు. హాజరైతే ఉపాధి పనికి వచ్చినట్లు మస్టర్లు వేస్తామని క్షేత్రస్థాయి సహాయకులు చెప్పినట్లు పలువురు కూలీలు పేర్కొన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని వారు వాపోయారు. దుకాణాలు మూసివేయించడంతో బయట కూడా కొనుగోలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతతో ఓ పక్క మంత్రులు ప్రసంగిస్తుండగా సభ ప్రారంభమైన పది నిమిషాలకే సగం మంది వెనుదిరిగారు.
విజయనగరంలో భారీ వర్షంతో రద్దయిన సభ
ఈనాడు, విజయనగరం: వైకాపా చేపట్టిన సామాజిక న్యాయభేరి బహిరంగ సభకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో సభ రద్దయ్యింది. పూసపాటిరేగ మండలం కందివలస వద్ద జిల్లాలోకి ఈ బస్సు యాత్ర అడుగు పెట్టింది. అక్కడ జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్వాగతం పలికారు. జమ్ము వద్ద పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో స్వాగతం పలికాయి. న్యూపూర్ణ థియేటర్ ఎదురుగా బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో భారీ వర్షం మొదలైంది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసింది. దాంతో కార్యకర్తలు, నేతలు, సభికులు చెల్లాచెదురయ్యారు. ఆ తర్వాత అరగంటకు అక్కడకు మంత్రుల బస్సు చేరుకొంది. కొంతసేపు వారు వాహనంలోనే వేచి ఉన్నారు. కొద్దిగా వర్షం తెరిపి ఇవ్వడంతో వేదికపైకి వచ్చారు. సభా ప్రాంగణంలో అతి కొద్దిమంది మాత్రమే ఉండడం, మైకులు పని చేయకపోవడంతో వారు వెనుదిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!