నేటి నుంచే మహానాడు
‘తెలుగుదేశం పిలుస్తోంది. రా.. కదలిరా!’ అంటూ ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు రాజకీయాల్లో పెను సంచలనం.. తెలుగు జాతి యావత్తూ ఉవ్వెత్తున కదిలి.. దిల్లీకి మోకరిల్లిన రాజకీయాలను కూకటివేళ్లతో పెకలించి నాలుగు
ఎన్నికల సమర శంఖం
మహానాడు వేదికగా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖుల్ని చేయడమే లక్ష్యం
అధికార పార్టీ ఆగడాలు, ప్రభుత్వ వైఫల్యాలపై దాడి
తెలుగుదేశం పార్టీ వ్యూహం
ఈనాడు, అమరావతి: ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా.. కదలిరా!’ అంటూ ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు రాజకీయాల్లో పెను సంచలనం.. తెలుగు జాతి యావత్తూ ఉవ్వెత్తున కదిలి.. దిల్లీకి మోకరిల్లిన రాజకీయాలను కూకటివేళ్లతో పెకలించి నాలుగు దశాబ్దాలైంది. ఎన్నో ఘన విజయాల్ని, అంతలోనే ఎదురు దెబ్బల్ని.. ఉద్యమ ఝరిని, ఉత్థాన పతనాల్ని చవిచూస్తూ కాలంతోపాటు రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పుల్ని తట్టుకుంటూ ఒక ప్రాంతీయ పార్టీ 40 ఏళ్లపాటు అప్రతిహత ప్రయాణం సాగించడం ఆషామాషీ కాదు. ఉమ్మడి రాష్ట్రం, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ కలిపి 21 ఏళ్లపాటు అధికారంలోనూ, 19 ఏళ్లపాటు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగడమూ విశేషమే. రాష్ట్ర రాజకీయాల దశను, దిశను మార్చి.. వడినీ, ఒరవడినీ నేర్పిన తెదేపా ఇప్పుడు పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోంది. మారిన రాజకీయ పరిస్థితుల వల్ల ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేయడం, ఎన్నికలకు ఇప్పటి నుంచే సమర శంఖం పూరించే లక్ష్యంతో ఆ పార్టీ శుక్ర, శనివారాల్లో ఒంగోలులో ‘మహానాడు’ నిర్వహిస్తోంది.
సవాళ్లకు దీటుగా..
వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులపై దాడులు, రాజకీయ కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయి. పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టించడం, తెదేపా శ్రేణుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం వంటివి అధికార పార్టీ ప్రత్యేక ఎజెండాగా అమలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని, కేడర్ను కాపాడుకోవడం తెదేపా అధినాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. అటు న్యాయ పోరాటం, ఇటు క్షేత్రస్థాయి పోరాటాల ద్వారా కేడర్లో స్థైర్యాన్ని నింపింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వం వేస్తున్న భారాలపై చేపట్టిన నిరసనలు, ‘బాదుడే బాదుడు’ వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కొన్నిచోట్ల స్తబ్ధుగా ఉన్న నాయకులు మళ్లీ క్రియాశీలంగా మారుతున్నారు. 2018 తర్వాత తెదేపా మళ్లీ ఇప్పుడే పార్టీ మహానాడును బహిరంగ వేదికపై, అట్టహాసంగా నిర్వహిస్తోంది. దీంతో కేడర్ ఉత్సాహంగా ఉంది. 2019లో ఎన్నికల వల్ల ప్రత్యేకంగా మహానాడు నిర్వహించలేదు. 2020, 2021ల్లో కొవిడ్ ఉద్ధృతంగా ఉండటం వల్ల ఆన్లైన్లోనే మహానాడు నిర్వహించారు. శాసనసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దీటుగా ఎదుర్కొనేలా, పార్టీ కేడర్ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా మహానాడు జరగనుంది. ఈ మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్రంగా విఫలమైందని, రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, వ్యవసాయం సహా అన్ని రంగాలూ సంక్షోభంలో కూరుకుపోయాయని, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని ఆరోపిస్తున్న తెదేపా.. మహానాడులో వాటిపైనే ఎక్కువగా గురి పెట్టనుంది.
యువతకు పెద్దపీట..
తెదేపా ఆవిర్భావం తర్వాత ఇప్పుడు మూడోతరం రాజకీయాల్లోకి వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ల అనుభవాన్ని, కొత్తతరం ఉత్సాహాన్ని సమన్వయం చేసుకుంటూ మరి కొన్ని దశాబ్దాలపాటు పార్టీ బలంగా నిలదొక్కునేలా పటిష్ఠం చేయాలన్న ఉద్దేశంతో అధినేత చంద్రబాబు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకు ఇస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మహానాడు నిర్వహణలోను యువతరానికి కీలక బాధ్యతలు అప్పగించారు.
కార్యక్రమాలు ఇవే..
తెదేపా మహానాడు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మొదలవుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు ఉదయం 10 గంటలకు ఫొటో ప్రదర్శన, రక్తదాన శిబిరాల్ని ప్రారంభిస్తారు. ఉదయం 10.15 నుంచి వేదికపై కార్యక్రమాలు మొదలవుతాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి, జెండా ఆవిష్కరణ ఉంటాయి. మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. ఉదయం 11.45కి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. తర్వాత తీర్మానాలపై చర్చ జరుగుతుంది. రాత్రి 8 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక, చంద్రబాబు ముగింపు ఉపన్యాసం ఉంటాయి. శనివారం ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. పార్టీ అధినేత ప్రసంగం ఉంటాయి. మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగులు తొలగిస్తే ఊరుకోను
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?