గ్రూపు-1 ప్రధాన పరీక్ష ఫలితాల విడుదల
గ్రూపు-1 (నోటిఫికేషన్ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది
జూన్ 15 నుంచి జరిగే మౌఖిక పరీక్షలకు 325 మంది ఎంపిక
ఈనాడు, అమరావతి: గ్రూపు-1 (నోటిఫికేషన్ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. జూన్ 15 నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలుత ఈ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ విధానంలో జరిగిన మూల్యాంకనంవల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సాధారణ పద్ధతిలోనే (పెన్ను, పేపర్) మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లో ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఇప్పుడు విడుదల చేసింది. డిజిటల్ మూల్యాంకనం ఫలితాల్లో ముందు వరసలో ఉన్న పలువురు అభ్యర్థులు వెనుకబడ్డారు. వెనుక వరసలో ఉన్నవారు ముందుకు వచ్చారు. జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూపు-1 పరీక్షలను 2020లో డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించారు. మౌఖిక పరీక్షలకు ఎంపికైన 325 మందిలో 124 మంది తొలి జాబితాలో ఉన్నవారేనని సమాచారం. తొలి జాబితాలో ముందు వరుసలో ఉన్న వారిలో పలువురు వెనుకబడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?