ప్రాణభయంతో బాత్రూంలో దాక్కున్నాం
‘మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి నిజంగానే జరిగిందా అని తెలుసుకునేలోపే 400-500 మంది రాళ్లతో మా ఇంటిపై దాడిచేశారు. గాజుపెంకులు తగులుతున్నాయని... నేను, నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూంలో
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్
ఈనాడు, కాకినాడ: ‘మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి నిజంగానే జరిగిందా అని తెలుసుకునేలోపే 400-500 మంది రాళ్లతో మా ఇంటిపై దాడిచేశారు. గాజుపెంకులు తగులుతున్నాయని... నేను, నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూంలో దాక్కోవాల్సి వచ్చింది. నన్ను, నా భార్యను మంటల్లో నుంచి పోలీసులు కిందకు తీసుకెళ్లారు’ అని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ తెలిపారు. ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటికి గురువారం ఆయన సతీసమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా ‘ఈనాడు- ఈటీవీ’తో మాట్లాడారు. ‘ఎక్కడైనా అల్లర్లు జరిగితే బస్సులు, ప్రభుత్వ ఆస్తులు తగలబెడతారు. ఇలా ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు జరుగుతాయని ఊహించలేదు. ఇదా రాజకీయం..? ఇలా అధికారంలోకి రావాలనుకుంటే భగవంతుడు కూడా క్షమించడు. జిల్లా పేరు మార్పులో మా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. జిల్లాకు అంబేడ్కర్ పేరు సాకారం కావడానికి విశ్వరూప్, నేను కారణమనే ఉద్దేశంతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఆయనను, నన్ను తగులబెట్టేయాలని చూశారు. ఆందోళనలోకి సంఘ విద్రోహశక్తులు ప్రవేశించడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ముందుగా గుర్తించడంలో నిఘా వైఫల్యం ఉంది’ అని ఎమ్మెల్యే సతీష్ చెప్పారు. ‘పవన్ కల్యాణ్ మంచి భావజాలం ఉన్న నాయకుడని ఇన్నాళ్లూ అనుకున్నాను. ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని ఊహించలేదు. మా ఇంట్లో మేముండి... ఇల్లు తగలబెట్టుకుంటామా? మా కుటుంబాలను బలి చేసుకునే రాజకీయాలు చేసే అవసరం మాకు లేదు. అందరినీ తృప్తిపరిచేలా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు ప్రతిపాదించాం. ముందే నిర్ణయం తీసుకుని అంబేడ్కర్ జిల్లా అని పేరు పెడితే మాట్లాడేవాడే లేడిక్కడ’ అని ఎమ్మెల్యే సతీష్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?