విధ్వంసంలో మంత్రి అనుచరులు..
అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం వెనుక అధికారపక్ష నాయకులు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వీడియో దృశ్యాల ఆధారంగా పలువురిని
వైకాపా ఎంపీటీసీ సభ్యుడూ..
ఎఫ్ఐఆర్లో భాజపా, తెదేపా, జనసేన, ఇతరుల పేర్లు..
అమలాపురం ఘటన దృశ్యాల్లో కీలక వ్యక్తుల జాడ నిక్షిప్తం
ఈనాడు, అమలాపురం: అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం వెనుక అధికారపక్ష నాయకులు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వీడియో దృశ్యాల ఆధారంగా పలువురిని ఇప్పటివరకు గుర్తించారు. తొలిగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అధికులు వైకాపాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో భాజపా, తెదేపా, జనసేన నాయకులతోపాటు ఇతరులూ ఉన్నారు. మంత్రి వెంట తిరిగే కొందరు ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనేందుకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే నివాసం సమీపంలో సేకరించిన సీసీటీవీ దృశ్యాల్లోనూ వైకాపా కార్యకర్తలు దాడుల్లో పాల్గొన్నట్లు ఆధారాల్లో నిక్షిప్తమైనట్లు తెలుస్తోంది. దీంతో చర్యలకు ముందుకు వెళ్లాలా..? వెళ్తే ఎలా వెళ్లాలనే మీమాంస నెలకొంది. విధ్వంసంలో తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నారని మంత్రి విశ్వరూప్ బుధవారం వ్యాఖ్యానిస్తూ.. వైకాపా బీసీ కౌన్సిలర్తో వీళ్లు నాలుగు రోజులుగా సంప్రదింపులు జరిపారని.. కాల్డేటా ఇతర ఆధారాలూ ఉన్నాయనడంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
46 మందిపై ఎఫ్ఐఆర్.. అందులో 14 మంది వైకాపా
అమలాపురంలో విధ్వంసంతో రూ.కోట్ల ఆస్తినష్టంతో పాటు.. పలువురు గాయపడ్డారు. ఈ దుశ్చర్య వెనక ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఇప్పటికే నిశితంగా పోలీసులు దృష్టిసారించి.. సాంకేతికత ఆధారంగా గుర్తించే చర్యల్లో కొంతమేరకు స్పష్టతకు వచ్చారు. మంగళవారం నాటి అల్లర్లలో అమలాపురం నల్లవంతెన వద్ద ‘వజ్ర’ వాహనం (ఏపీ 39పి 0020)పైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వాహనం డ్రైవర్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఈనెల 24న ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ప్రాథమికంగా 46 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇందులో వైకాపా కార్యకర్త అన్యం సాయి, ఈదరపల్లి వైకాపా ఎంపీటీసీ సభ్యుడు అడపా సత్తిబాబుతో పాటు వైకాపాకు చెందిన 14 మంది ఉన్నట్లు సమాచారం. భాజపా కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావుతో పాటు మరో అయిదుగురు పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. తెదేపా, జనసేనలకు చెందిన ముగ్గురేసి కార్యకర్తలూ ఈ అల్లర్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లు ఇవే...
వడగన నాగబాబు, నూకలపండు, కురసాల నాయుడు, థింక్ యాడ్స్ షావుకారు, దున్నల దిలీప్, అడపా శివ, ఆశెట్టి గుడ్డు, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్లా నాయుడు, నక్కా హరి, కిషోర్, దొమ్మేటి బాబు, నల్లా పృథ్వి, మోకా సుబ్బారావు, ఇళ్ల నాగవెంకట దుర్గనాయుడు, అడపా సత్తిబాబు, నల్లా రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నర్సింహమూర్తి, సంసాని రమేష్, కడలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్న, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మామిడిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళి, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాశిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వరరావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..