విధ్వంసానికి పాల్పడిన వారిలో 19 మంది అరెస్టు
అమలాపురంలో మంగళవారం జరిగిన విధ్వంస ఘటనలకు పాల్పడినవారిలో గురువారం 19 మందిని అరెస్టు చేశామని, వీరిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు వెల్లడించారు. శుక్రవారం మరికొంతమందిని
ఆందోళనకారులను రాజకీయకోణంలో చూడట్లేదు
ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు
అమలాపురం పట్టణం, పి.గన్నవరం, న్యూస్టుడే: అమలాపురంలో మంగళవారం జరిగిన విధ్వంస ఘటనలకు పాల్పడినవారిలో గురువారం 19 మందిని అరెస్టు చేశామని, వీరిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు వెల్లడించారు. శుక్రవారం మరికొంతమందిని అరెస్టు చేస్తామన్నారు. గురువారం రాత్రి ఆయన కోనసీమ, కాకినాడ జిల్లాల ఎస్పీలు సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్బాబు, కోనసీమ జిల్లా ఏఎస్పీ లతామాధురితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘నిరసనకారులు 20 వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు పంపుకొని అమలాపురంలో కలశం వద్దకు చేరారు. చివరగా భట్నవిల్లిలో మంత్రి విశ్వరూప్ సొంత ఇంటిని దగ్ధం చేసేవరకూ వీరి పాత్ర ఉంది. ఈ ఘటనకు సంబంధించి 19 మందిపై కేసులు నమోదుచేశాం. అరెస్టుచేసిన వారిపై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. బృందాలుగా విడిపోయి వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు వెంబడిస్తూ నల్లవంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆందోళనకారులు వజ్ర వాహనంపై దాడి, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి విధ్వంసాలకు పాల్పడ్డారు. వారిలో మరో బృందం కలెక్టరేట్ వద్దకు వెళ్లి అక్కడ ప్రైవేటు బస్సును దహనం చేసింది. అక్కడి నుంచి ఆరు వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారం పంపుకొని మంత్రి ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఎర్రవంతెన వద్ద రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు. అనంతరం మూకుమ్మడిగా ఎస్బీఐ కాలనీలో మంత్రి విశ్వరూప్ అద్దె ఇంటికి వెళ్లి నిప్పుపెట్టారు. తర్వాత ఒక బృందం హౌసింగ్బోర్డు కాలనీలో ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ ఇంటికి నిప్పుపెట్టింది. మరో బృందం భట్నవిల్లిలోని నిర్మాణంలో ఉన్న మంత్రికి చెందిన సొంత ఇంటికి చేరుకుని దానికీ నిప్పు పెట్టింది. విధ్వంసకారులను రాజకీయ కోణంలో చూడట్లేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు, నిఘా వైఫల్యంపై ఆత్మావలోకనం చేసుకుంటున్నాం. విధ్వంసకారులను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారం అంతటినీ సద్వినియోగం చేసుకుంటున్నాం. వారిని గుర్తించేందుకు ఆరు బృందాలను నియమించాం. వీరు కాకుండా ఆరు పికప్ పార్టీలు ఈ కేసులో పనిచేస్తున్నాయి’ అన్నారు. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.