YSRCP: ఒంటరిగా విజయం సాధించగలరా?
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాలని సామాజిక న్యాయభేరి యాత్రలో ప్రసంగించిన పలువురు రాష్ట్ర మంత్రులు సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సింహం సింగిల్గానే వస్తుందని, తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్మోహన్రెడ్డే
నరసరావుపేట సభలో చంద్రబాబుకు రాష్ట్ర మంత్రుల సవాల్
మూడోరోజు కొనసాగిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర
ఈనాడు-గుంటూరు, అమరావతి, ఈనాడు డిజిటల్- ఏలూరు: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాలని సామాజిక న్యాయభేరి యాత్రలో ప్రసంగించిన పలువురు రాష్ట్ర మంత్రులు సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సింహం సింగిల్గానే వస్తుందని, తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్మోహన్రెడ్డే అని వారు స్పష్టం చేశారు. శనివారం మూడోరోజు సామాజిక న్యాయభేరి యాత్ర తాడేపల్లిగూడెంలో ప్రారంభమై ఏలూరు, విజయవాడ, చిలకలూరిపేట మీదుగా రాత్రికి నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేట సభలో పలువురు మంత్రులు మాట్లాడుతూ... జగన్ను ఓడించడానికి పవన్ కల్యాణ్, సీపీఐ, సీపీఎం, భాజపా.. ఇలా అందరితో పొత్తు పెట్టుకుంటానని చెప్పడం సిగ్గుగా లేదా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరెన్ని పొత్తులు పెట్టుకున్నా.. పొర్లు దండాలు పెట్టినా... అధికారం కల్లేనని వ్యాఖ్యానించారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగిస్తూ...‘మహానాడు వేదికగా చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు మేం పంచుతున్నామంటున్నారు... ఆ పంచుడులో ఎక్కడైనా అవినీతి జరిగిందని చెప్పగలరా?
ఒక్క ఆరోపణ చేయలేకపోయారే? ఎవరికి పంచుతున్నాం? ఎంతో మందికి అన్నం పెడుతున్న అన్నదాతలకు, సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతికి చేయూతనిస్తున్నాం. అది మీ కళ్లకు కనిపించడంలేదా’ అని ధ్వజమెత్తారు. మంత్రి విడదల రజిని ప్రసంగిస్తూ... ‘మీ ఓట్లు నాకేయండి. మీ తలరాతలు మారుస్తానని హామీనిచ్చి అధికారంలోకి రాగానే దాన్ని ఆచరించి చూపిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది’ అని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘అసలు జగన్ను ఎందుకు ఓడించాలి? కరోనా సమయంలోనూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నందుకా... తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసినందుకా... ఆటోవాలాలు, డ్వాక్రా మహిళలకు రుణాలిప్పించి ఆదుకున్నందుకా..’ అని ప్రశ్నించారు. పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహానాడు వేదికపై బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు ఫొటో ఏది? ఇదేనా బీసీలకు ఇచ్చే ప్రాధాన్యం? అచ్చెన్నాయుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు’ అని విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘అది మహానాడు కాదు.. ఏడుపునాడు’...అని అభివర్ణించారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. కనీసం ఎమ్మెల్యేగా గెలవాలని లోకేశ్కు సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రతీకగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు ప్రసంగిస్తూ.. తరతరాలుగా తమకంటూ ఓ గుర్తింపు ఉంటుందా అని ఎదురు చూసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేశారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. శ్రీలంకలో ప్రధానిని తరిమికొట్టినట్లుగా జగన్ను తరిమికొట్టాలని మహానాడులో తెదేపా నేతలు మాట్లాడటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రివద్ద ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రాలేదు. విజయవాడ బెంజిసర్కిల్లో జరిగిన సభలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్లను ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని, దీనిలో ఏమైనా అవినీతి జరిగిందేమో నిరూపించేందుకు మహానాడులో చర్చ పెడతారా అని సవాలు విసిరారు. మంత్రి జోగి రమేష్ ప్రసంగిస్తూ.. మరో 25ఏళ్లు జగనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు.
ఎండకు అలసి సొలసి...
యాత్ర సందర్భంగా నిర్వహించిన పలు సభల్లో ప్రజలు ఎండలో రోడ్లపై నిల్చొనే నాయకుల ప్రసంగాలు వినాల్సి వచ్చింది. ఎండవేడిమి తట్టుకోలేక కొందరు వెనుదిరగడంతో చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. తాడేపల్లిగూడెంలో ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొందరు మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉంగుటూరు మండలం కైకరం దగ్గర టెంట్లు వేయకపోవడంతో సభకు హాజరైన వారంతా చెట్ల కింద నిరీక్షించారు. విజయవాడ బెంజిసర్కిల్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా... 2 గంటల వరకు మంత్రుల జాడలేకపోవడంతో దాహానికి తాళలేక మజ్జిగ ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డారు. ఆలాగే భోజనం ప్యాకెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది మహిళలు వెనుదిరిగారు. దీంతో మంత్రులు కేవలం 10 నిమిషాల్లోనే సభను ముగించాల్సి వచ్చింది. తాడేపల్లికి చెందిన మెప్మా సభ్యులను నగరపాలక అధికారులు ఉదయం 11.30 గంటలకల్లా పెద్ద సంఖ్యలో ఉండవల్లి కూడలికి తరలించారు. యాత్ర ఆలస్యమవుతుందని తెలియడంతో వారిని ఇంటర్ బోర్డు రాష్ట్ర కార్యాలయ సెల్లారులోకి తరలించారు. మెప్మా మహిళలు, వాలంటీర్లు ఎండకు తాళలేక అల్లాడిపోయారు. 2.30 గంటలకు బస్సు వచ్చింది. వీరంతా అక్కడికి వెళ్లేలోగానే అది వెళ్లిపోవడం గమనార్హం. చివరికి ఉసూరుమంటూ వారంతా అధికారులు, నాయకులను తిట్టుకుంటూ వెనుదిరిగారు.
* పెదకాకాని వై జంక్షన్వద్ద జరిగిన బస్సు యాత్రకు గుంటూరు నగరపాలక సంస్థ నుంచి పారిశుద్ధ్య సిబ్బంది, డ్వాక్రా మహిళలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను తరలించారు. అక్కడే సిబ్బందికి హాజరును నిర్ధారించే ఐరిష్ను సూపర్వైజర్ నమోదు చేయడం గమనార్హం.
* పెదకాకానిలో సభకు వస్తే ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు ఇస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో ఎండను సైతం లెక్క చేయకుండా గుంటూరు నగరం, తాడికొండ నియోజక వర్గాల నుంచి దివ్యాంగులు సభకు వచ్చారు. అందజేసిన వాటిల్లో కొన్ని ట్రైసైకిళ్లు తుప్పు పట్టి ఉన్నాయి. టైర్లలో గాలి లేదు. వాటిని తీసుకున్న వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
* ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరంలో బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన యువతుల నృత్య ప్రదర్శన చర్చనీయాంశమైంది. సమయాభావంతో సభను రద్దు చేశారు.
జగన్ కాలం చెల్లిన రాజకీయ నేత..
నాలిక్కరుచుకున్న మంత్రి కారుమూరి
‘జగన్ కాలం చెల్లిన రాజకీయ నేత’...అని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించడంతో సభా వేదికపై ఉన్న ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు. శనివారం గన్నవరంలో జరిగిన సభలో ఇది చోటుచేసుకుంది. మంత్రి కారుమూరి ఆవేశంగా ప్రసంగిస్తూ.. జగన్ బీసీలకు అన్నీ చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించే క్రమంలో... ఈర్ష్యతో, ద్వేషంతో, కుళ్లుతో, కుతంత్రంతో వ్యవహరిస్తున్న జగన్మోహన్రెడ్డి ‘అవుట్ డేటెడ్’ అయిపోయారని వ్యాఖ్యానించారు. అనంతరం కారుమూరి సర్దుకుని ‘సీఎం జగన్ అందరికీ మంచి చేస్తున్నారు. ఆయనకు అందరూ అండగా ఉండాలి’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.