‘దుల్హన్’కు ధోకా!
పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించే దుల్హన్ పథకానికి ప్రభుత్వం పూర్తిగా నీళ్లొదిలేసింది. ఈ పథకం అమలుపై ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా, అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా పలుమార్లు గొప్పగా హామీలిచ్చిన జగన్.. తీరా మూడేళ్లకాలం పూర్తయ్యాక చేతులెత్తేశారు...
పేద ముస్లింల పెళ్లిళ్లకు భారీగా సాయం చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు
రెట్టింపు చేసి అమలు చేస్తామని ప్రకటనలు
చివరకు డబ్బుల్లేవంటూ మొండిచేయి
ఈనాడు, డిజిటల్ - అమరావతి
పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించే దుల్హన్ పథకానికి ప్రభుత్వం పూర్తిగా నీళ్లొదిలేసింది. ఈ పథకం అమలుపై ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా, అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా పలుమార్లు గొప్పగా హామీలిచ్చిన జగన్.. తీరా మూడేళ్లకాలం పూర్తయ్యాక చేతులెత్తేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమానికి రూ. 1.60 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం మొదలు, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల వరకు పదేపదే చెబుతూ.. పేద ముస్లిం యువతుల వివాహ సాయానికి వచ్చేసరికి డబ్బుల్లేవంటూ పక్కనపెట్టేశారు. వైకాపా అధికారం చేపట్టాక 2019లో మంత్రివర్గ ఆమోదం తెలిపి.. 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెస్తామంటూ ఉత్తర్వులిచ్చారు. కానీ అమలు చేయలేదు. ఆ తర్వాత మరో ఏడాది సమయమివ్వండి.. గొప్పగా సాయం చేస్తామని ప్రకటించి, తాజాగా ఆ ఉత్తర్వులు ఉత్తవే అనేలా మొండిచేయి చూపారు. అప్పటివరకు ముస్లింలకు అందుతున్న రూ. 25 వేల సాయాన్ని 2015లో తెదేపా హయాంలో రూ. 50 వేలకు పెంచారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వివాహాలకు సంబంధించిన పథకాలన్నీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఆలోచనతో 2018లో దుల్హన్ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుకలో విలీనం చేశారు. తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్లకాలంలో దాదాపుగా 50 వేల మందికిపైగా ముస్లింలకు సాయం అందింది. చంద్రన్న పెళ్లికానుక అమల్లోకి వచ్చాక రూ.50 వేల మొత్తంలో పెళ్లి జరిగే సమయంలోనే 20%, మిగతా 80% పెళ్లి అయిన నెల రోజుల్లోనే అందించారు. వైకాపా అధికారంలోకి వస్తే దీన్ని రెట్టింపు చేసి ఇస్తామని ప్రతిపక్షనేతగా జగన్ పలుమార్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి ఏడాది సమయంలో వివాహం చేసుకున్న ముస్లిం జంటల నుంచి దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ వారికి ఒక్క రూపాయి చెల్లించలేదు.
అడుగడుగునా కప్పదాట్లే..
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని వైఎస్సార్ పెళ్లి కానుకగా మార్చి అమలు చేస్తామని ప్రకటించింది. 2018-19 ఏడాదిలో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల వివాహాల్ని ప్రాతిపదికగా తీసుకుని 2019-20లో 1.28 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు మొదటి బడ్జెట్లో రూ. 716 కోట్లు ప్రతిపాదించారు. 2019 సెప్టెంబరులో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 2020 నుంచి అమల్లోకి వస్తుందని, దీని కోసం రూ.750 కోట్లు కేటాయించినట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం అప్పటి మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ముస్లిం యువతుల వివాహానికి గతంలో ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచి ఇస్తామని అదే నెల 16వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని 2020 ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా వాటన్నింటికీ తిలోదకాలిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల పెళ్లిసాయమూ హుళక్కేనా?
దుల్హన్ పథకాన్ని నిలిపేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకంతో ముడిపడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగుల వివాహానికి ఇస్తామన్న సాయంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. చంద్రన్న పెళ్లికానుక అమల్లోకి వచ్చిన తర్వాత 2018-19 ఏడాదిలో ఆయా వర్గాలకు చెందిన 83 వేల కొత్త జంటలకు రూ. 320 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని అందించి భరోసా ఇచ్చారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సాయాన్ని లక్షకు పెంచి అమలు చేస్తే సుమారు రూ. 700 కోట్ల వరకు వ్యయం కానుంది. దుల్హన్ పథకాన్ని నిలిపేసిన నేపథ్యంలో మిగతా వర్గాల సాయమూ హుళక్కే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 316 కోట్ల బకాయిలూ ఎగవేతేనా?
మొదటి ఏడాది బడ్జెట్ కేటాయింపులతో అర్హుల నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 70 వేల మంది లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సాయం ప్రకారం వీరికి రూ.316 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. కొత్త సాయం ప్రకారం లెక్కిస్తే దాదాపుగా రెట్టింపు చెల్లించాలి.
కల్యాణమిత్రల విషయంలోనూ మాట తప్పుడే..
గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులను కల్యాణమిత్రలుగా నియమించి ఈ పథకాన్ని అమలు చేశారు. పెళ్లిళ్ల వివరాల నమోదు ఆధారంగా వారికి రూ. 250 నుంచి రూ. 500 వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి చెల్లించలేదు. దీంతో వారికి ఉపాధి కూడా దూరమైంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆయన్ను కలిసినప్పుడు ఈ పథకం కొనసాగుతుందని, గతంలో ఇచ్చిన మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు నిలిపేయడం అన్యాయమని కల్యాణమిత్రలు వాపోతున్నారు.
* గతంలో ఎస్టీ, మైనార్టీ యువతులవివాహానికి అందిన సాయం: రూ. 50 వేలు, ఎస్సీలకు రూ. 40 వేలు. బీసీలకు రూ. 35 వేలు
* వైకాపా ప్రభుత్వం ఇస్తామన్న సాయం: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి రూ.లక్ష, బీసీలకు రూ. 50 వేలు
* కులాంతర వివాహాలకు ప్రోత్సాహం: దంపతులకు రూ. 1.20 లక్షలు
జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా, ఎన్నికల కోసం ఇంకోలా ఉండే వాడు కాదు మీ జగన్. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో.. అదే చేస్తాడు.
- ప్రభుత్వం ఈ నెల 14న పత్రికల్లో ఇచ్చిన భారీ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఉద్ఘాటన
ముస్లిం అక్కచెల్లెమ్మలకు నేను భరోసా ఇస్తున్నా. మీ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయండి. దుల్హన్ పథకం కింద ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతా. పేరును వైఎస్సార్ దుల్హన్ పథకంగా మారుస్తా. మీరు పెళ్లి చేసే రోజునే రూ.లక్ష అందిస్తానని మాట ఇస్తున్నా.
- ఎన్నికల ముందు ముస్లింలతో నిర్వహించిన సభలో ప్రతిపక్షనేతగా జగన్ హామీ
వివాహం సందర్భంగా ముస్లిం యువతులకు సాయం అందించే దుల్హన్ పథకాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. సంబంధిత అధికారులే ఈ విషయాన్ని తెలిపారు. దాన్నే కోర్టు ముందు ఉంచుతున్నా.
-దుల్హన్ పథకం అమలుపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ) హైకోర్టుకు నివేదన
బీసీ యువతుల వివాహానికి ఇస్తున్న రూ.35 వేల ఆర్థిక సాయాన్ని రూ.50 వేలకు పెంచుతాం. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ యువతుల వివాహానికి రూ.లక్ష చొప్పున సాయాన్ని అందిస్తాం.
- వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన
ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.
- ప్రతిపక్ష నేతగా పలు సభల్లో జగన్ వ్యాఖ్యలు
చంద్రబాబు పెట్టిన పెళ్లికానుక పథకం నవంబరు 2018 నుంచే తెరమరుగైంది. నేను చెప్పిన మాట నాకు గుర్తుంది. నాకు 2020 మార్చి వరకు సమయం ఇవ్వండి. అప్పటి నుంచి బ్రహ్మాండమైన వైఎస్సార్ పెళ్లికానుక అనే పథకాన్ని తీసుకొస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసి ఇస్తాం.
- 2019 నవంబరు 11న విజయవాడలో నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్