‘పింఛను’కు పార్టీ రంగు!

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘వైఎస్సార్‌ పింఛను కానుక’ నగదు... ఇకపై ప్రత్యేక కవర్లలో లబ్ధిదారుల చేతికి అందనుంది. వైకాపా జెండా రంగులతో సిద్ధం చేసిన కవర్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతోపాటు ‘అవ్వా తాతలకు,

Published : 24 Jun 2022 02:42 IST

న్యూస్‌టుడే, గాజువాక: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘వైఎస్సార్‌ పింఛను కానుక’ నగదు... ఇకపై ప్రత్యేక కవర్లలో లబ్ధిదారుల చేతికి అందనుంది. వైకాపా జెండా రంగులతో సిద్ధం చేసిన కవర్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతోపాటు ‘అవ్వా తాతలకు, అక్కచెల్లెమ్మలకు ప్రేమతో.. మీ కుటుంబ సభ్యుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి’ అని ముద్రించారు. ఈ కవర్లు ఇప్పటికే విశాఖ నగర వ్యాప్తంగా అన్ని జోన్ల కార్యాలయాలకు చేరుకున్నాయి. జులైలో కొత్తగా మంజూరైన పింఛన్లు వీటిలో పెట్టి ఇవ్వనున్నట్లు జీవీఎంసీ యూసీడీ విభాగం అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని