కుడివైపు గుండె.. దానిలో పెద్ద రంధ్రం: నాలుగేళ్ల బాలుడికి ‘ఆంధ్రా’లో అరుదైన సర్జరీ
పుట్టుకతోనే గుండె సహా కుడివైపు అవయవాలన్నీ ఎడమవైపు, ఎడమపక్క అవయవాలన్నీ కుడిపక్కన ఉండటంతో పాటు, గుండెలో పెద్ద రంధ్రం ఉన్న నాలుగేళ్ల బాలుడికి విజయవాడలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ వైద్యులు
ఈనాడు, అమరావతి: పుట్టుకతోనే గుండె సహా కుడివైపు అవయవాలన్నీ ఎడమవైపు, ఎడమపక్క అవయవాలన్నీ కుడిపక్కన ఉండటంతో పాటు, గుండెలో పెద్ద రంధ్రం ఉన్న నాలుగేళ్ల బాలుడికి విజయవాడలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన తరుణ్ అనే ఆ బాలుడికి ‘ఇంటరప్టెడ్ ఐవీసీ’ అనే సమస్య కూడా ఉంది. హృద్రోగ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఆర్.దిలీప్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కీహోల్ విధానంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. అలాంటి అరుదైన సమస్యలున్న, అంత చిన్న వయసు పిల్లలకు కీహోల్ విధానంలో సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ఇదే మొదటిసారని డాక్టర్ దిలీప్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ విక్రమ్ ‘ఈనాడు-ఈటీవీకి’ తెలిపారు.
బాలుడికి ఉన్న సమస్యలను, చేసిన చికిత్స విధానాన్ని ఇలా వివరించారు...
‘ఎడమపక్క అవయవాలు కుడిపక్క, కుడివైపు అవయవాలు ఎడమవైపు ఉండటాన్ని వైద్య పరిభాషలో ‘సైటస్ ఇన్వర్సెస్ టొటాలిస్’ అంటారు. అది పెద్ద సమస్య కాదు. కానీ తరుణ్కి గుండె గదులు కూడా రివర్స్లో ఉండటంతో పాటు, పై గదుల్లో పెద్ద రంధ్రం ఉంది. పిల్లలకు గుండెలో చిన్న రంధ్రం ఉంటే... కాలినుంచి రక్తనాళాల ద్వారా వైరు సాయంతో బటన్ (ప్రత్యేక పరికరం) పంపించి దాన్ని పూడ్చేస్తాం. తరుణ్కి గుండెలో పెద్ద రంధ్రం ఉండటంతో పాటు, ఆ పరికరాన్ని పట్టి ఉంచేందుకు మార్జిన్స్ లేవు. అందువల్ల బటన్తో రంధ్రాన్ని పూడ్చే పరిస్థితి లేదు. పైగా అతనికి మరో అరుదైన సమస్య ఉంది. సాధారణంగా కాళ్లు, కాలేయం వంటి శరీరంలోని కింది భాగాల నుంచి చెడురక్తాన్ని గుండెకు తీసుకొచ్చే... ఇన్ఫీరియర్ వీనకావా (ఐవీసీ) అనే సిర కింది భాగమే గుండెలోకి తెరుచుకుంటుంది. బాలుడికి అలాకాకుండా.. వెనక నుంచి పైకి వెళ్లి, మెడ భాగంలో సుపీరియర్ వీనకావా (ఎస్వీసీ) అనే ప్రధాన సిరలోకి ఓపెన్ అవుతోంది. దాంతో ఆపరేషన్ సంక్లిష్టమైంది’ అని డాక్టర్ దిలీప్ వివరించారు. ‘సాధారణ కోత విధానంలో శస్త్రచికిత్స తేలిక. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఇబ్బందులు ఉండకూడదనే కీహోల్ సర్జరీ చేశాం. ఇకపై బాలుడు మిగతా పిల్లల్లాగే సాధారణ జీవితం గడపొచ్చు. పెద్దయ్యాక శారీరక శ్రమ ఎక్కువ ఉండే ఉద్యోగాలూ చేయవచ్చు’ అని దిలీప్ వివరించారు. ‘ఆరోగ్య శ్రీ’ కింద శస్త్రచికిత్స చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.