తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఏనుగుల సంచారం

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని ఎలిఫెంట్‌ ఆర్చికి సమీపంలో ఏనుగుల గుంపు సంచరించిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సమీపంలోని అటవీప్రాంతం నుంచి

Published : 24 Jun 2022 05:17 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని ఎలిఫెంట్‌ ఆర్చికి సమీపంలో ఏనుగుల గుంపు సంచరించిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సమీపంలోని అటవీప్రాంతం నుంచి ఘాట్‌రోడ్డు వద్దకు చేరుకున్న ఏనుగుల గుంపు రోడ్డుకు పక్కనే ఉన్న వెదురుచెట్లను విరిచి తినసాగాయి. ఘాట్‌రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనచోదకులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అవి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయాయి. గతంలోనూ ఏనుగులు ఇదే ప్రాంతంలో సంచరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని