జులై 2నే హైదరాబాద్‌కు నరేంద్ర మోదీ

హైదరాబాద్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక రోజు ముందు రానున్నారు.

Published : 25 Jun 2022 04:25 IST

4న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రధాని

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక రోజు ముందు రానున్నారు. జులై 1న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. జులై 2న హైదరాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4వ తేదీ వరకు అక్కడే ఉంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. 4న ఆయన హైదరాబాద్‌ నుంచే ఆంధ్రప్రదేశ్‌ వెళ్తారని.. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలలో పాల్గొంటారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు