సజయ ‘అనువాద’ వైవిధ్యానికి.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయను అనువాద రచనలో ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి అనువాద రచనల విభాగంలో పురస్కారాలను అకాడమీ శుక్రవారం ప్రకటించింది.
‘అశుద్ధ భారత్’ తెలుగు సేతను వరించిన గౌరవం
ఈనాడు, దిల్లీ, హైదరాబాద్: సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయను అనువాద రచనలో ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి అనువాద రచనల విభాగంలో పురస్కారాలను అకాడమీ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లిషు సహా 22 భారతీయ భాషల్లో అనువాద రచనలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ.. మైథిలీ, రాజస్థానీ భాషల్లో అనువాద పురస్కారాలను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ హిందీలో రచించిన ‘అదృశ్య భారత్’ను (నాన్ఫిక్షన్) సజయ ‘అశుద్ధ భారత్’ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల దుర్భర జీవన స్థితిగతులపై ఆధారాల సహితంగా తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అనువాద రచన ఎంపికకు జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్ ఎస్.శేషారత్నం, వై.ముకుంద రామారావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు వ్యవహరించారు. అవార్డు కింద సజయకు రూ.50వేల నగదు, తామ్రఫలకం అందజేయనున్నారు. సజయ స్వగ్రామం కృష్ణా జిల్లా పెద్దముత్తేవి. మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్ల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. మహిళల సమస్యలపై ఆమె పోరాడారు.
ఇది నాకు లభించిన అవార్డు కాదు..
ఈ సందర్భంగా సజయ ‘ఈనాడు’తో మాట్లాడుతూ తాను ఎంచుకున్న అంశం తీవ్రమైందన్నారు. దేశవ్యాప్తంగా సఫాయి కార్మికుల సమస్య ఒకటుందని పాలకులు గుర్తించలేదన్నారు. దానిపై ఇప్పటికీ చిత్తశుద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇది తనకు లభించిన పురస్కారం కాదని, ఎంచుకున్న సబ్జెక్టుకు, పుస్తకాన్ని ప్రచురించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్, తనకు సహకరించిన మరికొందరికి ఆ గౌరవం దక్కుతుందని వివరించారు. సజయ రచయిత్రిగా, అనువాదకురాలిగా, స్వతంత్ర పాత్రికేయురాలిగా, ప్రచురణకర్తగా, డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్గా, సామాజిక కార్యకర్తగా విభిన్న పాత్రలు పోషిస్తూనే.. మహిళలు, ట్రాన్స్జెండర్ల సమస్యలు, యురేనియం తవ్వకాలు, భారత వ్యవసాయ సంక్షోభం, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందులపై పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా