ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3నుంచి

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం

Published : 25 Jun 2022 04:25 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది వారికి, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22వరకు ఉంటాయని, నైతికత, మానవ విలువలు పరీక్ష 24న, పర్యావరణం పరీక్ష 26న నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు జులై 8లోపు పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని