విద్యాశాఖకు 2,114 పుర పాఠశాలల బదిలీ
రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలకు చెందిన 2,114 పాఠశాలలను విద్యాశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. వీటిపై పర్యవేక్షణ, అజమాయిషీ, పరిపాలన వ్యవహారాలను ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉన్న విధానాలనే వీటిలోనూ అమలు చేయనున్నారు.
వీటిపై పర్యవేక్షణ, అజమాయిషీ ఈ శాఖదే
స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కులు పట్టణ స్థానిక సంస్థలకే
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలకు చెందిన 2,114 పాఠశాలలను విద్యాశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. వీటిపై పర్యవేక్షణ, అజమాయిషీ, పరిపాలన వ్యవహారాలను ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉన్న విధానాలనే వీటిలోనూ అమలు చేయనున్నారు. ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆస్తులు పట్టణ స్థానిక సంస్థల ఆధీనంలోనే ఉంటాయని పేర్కొంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల విజ్ఞప్తులపై పుర పాఠశాలల బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 59 పుర, నగరపాలక సంస్థలకు చెందిన 345 ఉన్నత, 149 ప్రాథమికోన్నత, 1,620 ప్రాథమిక పాఠశాలలను బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జీవో విడుదల చేసింది. ఈ జీవో అమలులోకి వచ్చేలా తదుపరి చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్కుమార్ పుర, నగరపాలక సంస్థల కమిషనర్లను ఆదేశిస్తూ కూడా ఉత్తర్వులిచ్చారు.
పాఠశాలలపై పర్యవేక్షణ కష్టతరమవుతోంది
* పాఠశాలలపై పర్యవేక్షణకు పుర, నగరపాలక సంస్థల్లో తగిన వ్యవస్థ లేదని ప్రభుత్వం పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థలు ప్రాథమిక బాధ్యతలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందున పర్యవేక్షణ కష్టతరమవుతోంది.
* ఉపాధ్యాయుల నియామకం 2000కి ముందు ఆయా పుర, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో జరిగేది. 2000 నుంచి జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నియామకాలు చేస్తోంది. వీరికి కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల వలే 010 పద్దు నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు.
* విలీనం చేయడం లేదు. కేవలం పర్యవేక్షణ, అజమాయిషీకే పరిమితం. స్థిర, చరాస్తులపై పుర, నగరపాలక సంస్థలు పూర్తి యాజమాన్య హక్కులు కలిగి ఉంటాయి. పుర ఉపాధ్యాయులకు ప్రత్యేక సర్వీస్ నిబంధనలు విద్యాశాఖ విడుదల చేస్తుంది. బోధనేతర సిబ్బంది ప్రస్తుతానికి కొనసాగుతారు. కంటింజెంట్ సిబ్బంది విద్యాశాఖ పరిధిలోకి వస్తారు.
* నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఎఫ్, పదోన్నతులు, బదిలీలు పురపాలక ఉపాధ్యాయులకు వర్తిస్తాయి.
* పురపాలకశాఖ, మహా విశాఖ, విజయవాడ నగరపాలక సంస్థలు విడుదల చేసిన సర్వీస్ నిబంధనల మేరకు ఉపాధ్యాయులకు పదోన్నతులు, సీనియారిటీకొనసాగుతుంది. అపిలేట్ అథారిటీగా ఉన్న పురపాలక సంచాలకుడి నుంచి విద్యాశాఖ సంచాలకుడికి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి