ఫోరెన్సిక్ నివేదికకు మూడేళ్లా?
వైద్య విద్యనభ్యసిస్తున్న తన కుమారుడి మృతికి సంబంధించి ఓ తల్లి నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తే, పోలీసులు ఆ కోణాల్లో విచారించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పించుకోవడంలో ఆలస్యంపై ఆగ్రహించింది.
ఆధారాలిచ్చినా దర్యాప్తులో పురోగతి ఏది?
మెడికో మృతికేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం
సమర్థుడైన డీఎస్పీకి అప్పగించాలని డీజీపీకి ఆదేశం
ఈనాడు, అమరావతి: వైద్య విద్యనభ్యసిస్తున్న తన కుమారుడి మృతికి సంబంధించి ఓ తల్లి నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తే, పోలీసులు ఆ కోణాల్లో విచారించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పించుకోవడంలో ఆలస్యంపై ఆగ్రహించింది. నెల రోజుల్లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని, డీఎస్పీ హోదా గల అధికారితో ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయించాలని డీజీపీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ నెల 20న ఆదేశాలిచ్చారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు వైద్య కళాశాలలో చదువుకుంటున్న పుష్పక్నాయక్ 2019 జులై 29న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటనపై అప్పట్లో ఏలూరు గ్రామీణ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మృతుడి తల్లి గుగులోతు వరలక్ష్మి 2021 జనవరిలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్కుమార్ వాదిస్తూ.. ‘పుష్పక్ నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న పోలీసుల వాదన సరికాదు. కులం పేరుతో వేధింపులు, ర్యాగింగ్ జరిగాయి. ఆత్మహత్యకు ఆనవాళ్లు లేవు. మృతుడి కాల్డేటా, అనుమానితుల ఫోన్ నంబర్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను పోలీసులకు ఇచ్చినా ఆ కోణాల్లో దర్యాప్తు చేయలేదు. మృతికి కారకులైన వ్యక్తులకు పోలీసులు రక్షణగా నిలుస్తున్నార’ని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, ‘ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రావాల్సి ఉంది. పుష్పక్ పరీక్షల్లో ఫెయిలై కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. సీబీఐ న్యాయవాది కల్పించుకొని, అవినీతి కేసుల దర్యాప్తుతో సీబీఐపై పనిభారం అధికంగా ఉందని, ప్రస్తుత కేసు విచారించలేదని చెప్పారు.
చట్టబద్ధ దర్యాప్తు బాధ్యత పోలీసులదే
ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ‘ఘటన 2019 జులై 29న జరిగితే, ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడు పుష్పక్ కాల్డేటా అవసరమని దర్యాప్తు అధికారి 2019 జులై 30న కేసు డైరీలో రాశారు. మృతుడి సెల్ఫోన్ను అప్పుడే మంగళగిరి ఎఫ్ఎస్ఎల్కు పంపామన్నారు. ఇప్పటికీ ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం అంటున్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి, దర్యాప్తు అధికారి కార్యాలయానికి ఈ ల్యాబ్ ఎంతో దూరంలో లేదు. నివేదిక తెప్పించుకోవడానికి పోలీసులకు ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు పడుతోంది? మృతుడి తల్లి 13 ఫోన్నంబర్లు ఇవ్వగా, వాటి ఆధారంగా చేపట్టిన దర్యాప్తు వివరాలేవీ కేసు డైరీలో లేవు. తమ కుమారుడిని సీనియర్లు ర్యాగింగ్ చేశారని, కులం పేరుతో దూషించారని చేసిన ఆరోపణలనూ తేల్చలేదు. డబ్బు లావాదేవీల బ్యాంక్ స్టేట్మెంట్లు, విమాన ప్రయాణ టికెట్లు ఇచ్చినా వాటి ఆధారంగా పరిశోధించలేదు. నేరం జరిగినప్పుడు అన్ని కోణాల్లో విచారించాల్సిన నైతిక, చట్టబద్ధ బాధ్యత పోలీసులదే. బిడ్డను కోల్పోయిన బాధతో తల్లి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి ఉండొచ్చు. కాని నిర్ధిష్టమైన ఆరోపణలపైనా పోలీసుల క్రియాశీలంగా స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దర్యాప్తులో జాప్యం/ముగింపు పలకపోవడం అధికరణ 21ను ఉల్లంఘించడమే’నని పేర్కొన్నారు. ఇకపై ఈ కేసును సమర్థుడైన డీఎస్పీ లేదా ఆ పైస్థాయి ర్యాంకు గల అధికారికి అప్పగించాలని, ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయించాలని డీజీపీని ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. దర్యాప్తు అధికారికి మరే ఇతర విధులు కేటాయించవద్దని, ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు