అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో నేడు నిధుల జమ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేసే కార్యక్రమాన్ని

Published : 27 Jun 2022 04:04 IST

శ్రీకాకుళంలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేసే కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు కోడిరామ్మూర్తి మైదానానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మఒడి పథకం లబ్ధిదారులతో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరిగి పయనమై 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని