తిరుమల మొదటి ఘాట్‌లో ఏనుగుల గుంపు

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు మరోమారు కలకలం సృష్టించింది. మొదటి ఘాట్‌ రోడ్డులోని ఎలిఫెంట్‌ ఆర్చ్‌కు సమీపంలో ఆదివారం సాయంత్రం 10 ఏనుగులు

Published : 27 Jun 2022 04:29 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు మరోమారు కలకలం సృష్టించింది. మొదటి ఘాట్‌ రోడ్డులోని ఎలిఫెంట్‌ ఆర్చ్‌కు సమీపంలో ఆదివారం సాయంత్రం 10 ఏనుగులు చెట్లను విరిచేస్తూ శబ్దాలు చేయడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. తితిదే అటవీశాఖ సిబ్బంది ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో గజరాజులు రావడం ఇది రెండోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని