ఆంక్షల వలయంలో శ్రీకాకుళం
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో విధించిన ఆంక్షలు ప్రజలను కష్టాల పాల్జేశాయి. హెలిప్యాడ్ ఉన్న ఆర్అండ్బీ బంగ్లా నుంచి అమ్మఒడి కార్యక్రమ సభావేదిక అయిన కోడి రామ్మూర్తి స్టేడియం వరకూ
దారుల్లో బారికేడ్ల ఏర్పాటు, దుకాణాల మూసివేత
ఉక్కపోతతో సభను వీడిన మహిళలు
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో విధించిన ఆంక్షలు ప్రజలను కష్టాల పాల్జేశాయి. హెలిప్యాడ్ ఉన్న ఆర్అండ్బీ బంగ్లా నుంచి అమ్మఒడి కార్యక్రమ సభావేదిక అయిన కోడి రామ్మూర్తి స్టేడియం వరకూ రహదారికి ఇరువైపులా భారీస్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా పరదాలతో కప్పేశారు. వీధుల నుంచి వాహనాలను బయటకు రానీయలేదు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకూ దుకాణాలు తెరవనీయలేదు. నగరంలోకి బస్సులు, ఇతర వాహనాలను అనుమతించకపోవడంతో ప్రయాణికులు శివార్లలో గంటల తరబడి నిరీక్షించారు. ట్రాఫిక్ ఆంక్షలు కఠినం చేయడంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయ సంఘాల నేతలను, వామపక్షాల నాయకులను గృహనిర్బంధం చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను, వారి తల్లులను పెద్దసంఖ్యలో తరలించిన అధికారులు.. అందుకు తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు. సగానికి పైగా మండుటెండలో ఉండిపోయారు. వేడిమికి తట్టుకోలేక ఆరుగురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారు. కొందరికి అక్కడే చికిత్స అందించగా, ఒక విద్యార్థినిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. సభ ప్రారంభానికి ముందే కొందరు పిల్లలు, తల్లులు బయటకు వచ్చేశారు.
కిల్లి కృపారాణికి చేదు అనుభవం: ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కేంద్ర మాజీ మంత్రి, వైకాపా జిల్లా మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఆర్అండ్బీ భవనం ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్దకు రాగా, ప్రొటోకాల్ జాబితాలో ఆమె పేరు లేదంటూ భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆమె ఆగ్రహంతో ‘కిల్లి కృపారాణినే మర్చిపోతారా?’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమెను బుజ్జగించేందుకు మంత్రి సీదిరి అప్పలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కృష్ణదాస్ ఆమె కారు వద్దకెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. ‘అన్నయ్యా.. ఇక్కడ జరిగిందంతా బావ(తన భర్తనుద్దేశించి)కు తెలిసిపోయింది. ఆయన నన్ను చంపేస్తారు. నేను ఎమోషన్కు గురవుతున్నాను. దయచేసి మన్నించు’ అంటూ వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!