ఖజానాకు ఇం‘ధనమే’!
2021-22లో రాష్ట్రానికి రూ. 14,724 కోట్లు
ఈనాడు, అమరావతి: పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నా వీటి అమ్మకాలు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ఖజానాలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 7.74 లక్షల కోట్లు జమ అయ్యాయి.. 2020-21 సంవత్సరంతో పోలిస్తే.. ఇది 15.12% అధికం. వసూలైన మొత్తంలో కేంద్ర వాటా 64%.. రాష్ట్రాల వాటా 36% ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సహా కొన్ని రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకున్నా రాబడి రూ. 1.02 లక్షల కోట్లు పెరిగింది. ఏడాదిలో కేంద్ర పన్నుల్లో వృద్ధి 8.20% ఉండగా.. రాష్ట్రాల పన్నుల్లో వృద్ధి 29.62% నమోదైంది. మొత్తం రాబడిపరంగా చూస్తే సింహభాగం కేంద్రానికే దక్కుతోంది. రాష్ట్ర ఖజానాకు 2021-22 సంవత్సరంలో రూ. 14,724 కోట్లు జమయ్యాయి. 2019-20 సంవత్సరంతో పోలిస్తే.. రాష్ట్ర పన్నులపై వసూలయ్యే మొత్తం రూ. 4,556 కోట్లు పెరిగింది. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్పై పన్ను బాదుడు అధికంగా ఉండటమే దీనికి కారణం. అందుకే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. మేమేమీ పెంచలేదంటూనే.. రాష్ట్రం వినియోగదారుల్ని బాదేస్తోంది. 2019 సంవత్సరంలో లీటరు పెట్రోలుపై 31% వ్యాట్, లీటరుకు రూ.2 చొప్పున అదనపు వ్యాట్, డీజిల్పై 22.25% వ్యాట్, లీటరుకు రూ. 2 చొప్పున అదనపు వ్యాట్ ఉండేవి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు వ్యాట్ను లీటరుకు రూ. 2 చొప్పున పెంచడంతోపాటు రోడ్డు అభివృద్ధి సుంకం రూపంలో లీటరుకు రూ. 1 (దీనిపై వ్యాట్ అదనం) చొప్పున వడ్డించింది. వీటన్నిటి నేపథ్యంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరిగింది. 2019-20తో పోలిస్తే.. 2020-21లో రూ.846 కోట్లు అధికంగా వచ్చింది. మొత్తంగా చూస్తే 2021-22 సంవత్సరంలో ఏకంగా 3,719 కోట్ల పెరుగుదల నమోదైంది. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం రెండు దఫాలుగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుంది. దీంతో కొన్ని రాష్ట్రాలు తామూ సిద్ధమంటూ పన్నుల్ని తగ్గించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం పైసా కూడా తగ్గించలేదు. పైగా కేంద్రం తగ్గించడం వల్ల తమ ఆదాయం పడిపోతోందని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Janhvi Kapoor: నటి జీవితం.. సౌకర్యంగా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వికపూర్
-
General News
Telangana News: కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు
-
Politics News
Dharmana Prasad Rao: పవన్ పోస్టర్ చూసి మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహనం!
-
General News
Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
PV Sindhu: కామన్వెల్త్లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- iPhone 14: యాపిల్ ప్రియులకు బ్యాడ్న్యూస్.. ఐఫోన్ 14 రాక ఆలస్యం?
- CWG 2022: భారత్కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- Quit India: నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..!