విశాఖకు త్వరలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్: మంత్రి అమర్నాథ్
రెండునెలల్లో విశాఖకు ఇన్ఫోసిస్ రానుందని, హెచ్సీఎల్ కూడా విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోందని పరిశ్రమల మంత్రి అమర్నాథ్ తెలిపారు. సోమవారం విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘అంతర్జాతీయ ఎం.ఎస్.ఎం.ఇ.
ఈనాడు, విశాఖపట్నం: రెండునెలల్లో విశాఖకు ఇన్ఫోసిస్ రానుందని, హెచ్సీఎల్ కూడా విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోందని పరిశ్రమల మంత్రి అమర్నాథ్ తెలిపారు. సోమవారం విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘అంతర్జాతీయ ఎం.ఎస్.ఎం.ఇ. దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖలో ఆదిత్య మిత్తల్ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని, 3, 4 వేల ఎకరాలు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 1.25 లక్షల ఎం.ఎస్.ఎం.ఇ.లను ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఫలితంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడి, 1.50 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయన్నారు. గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మొత్తం 28 వేల ఎం.ఎస్.ఎం.ఇ.లు ఏర్పడ్డాయని, 1.56 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. పరిశ్రమలు పెట్టాలనుకున్న వారి సౌకర్యార్థం కొన్ని ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ చిరునామాలను త్వరలో విడుదల చేయబోతున్నామన్నారు. అనకాపల్లి దగ్గరలోని కోడూరులో 30 ఎకరాల్లో ఆటోనగర్ను, 40 ఎకరాల్లో ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్కు 15 రోజుల్లో శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ. జాతీయ బోర్డు సభ్యుడు విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ విశాఖ, తిరుపతిల్లో కూడా సూక్ష్మ, చిన్నతరహా సంస్థ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్