ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
తెల్లవారితే బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. అన్ని ఏర్పాట్లూ జరిగాయి.. సిఫార్సులతో సంబంధం లేకుండా, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు రవాణాశాఖ కమిషనర్ కాటంనేని
సిఫార్సులు ఒప్పుకోలేదని రవాణా శాఖ కమిషనర్పై కినుక
ఆయనను మార్చాలని సీఎంఓపై ఓ అమాత్యుడి ఒత్తిడి
తనిఖీల నుంచి పత్రాల వరకు ప్రక్షాళన ఫలితం!
ఈనాడు, అమరావతి: తెల్లవారితే బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. అన్ని ఏర్పాట్లూ జరిగాయి.. సిఫార్సులతో సంబంధం లేకుండా, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు రవాణాశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ సన్నాహాలు చేశారు. ఇంతలోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఇది ఆ శాఖలో సంచలనంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా నిబంధనలు కచ్చితంగా పాటిస్తానని చెప్పిన ఆయన్ను చివరి నిమిషంలో పదవి నుంచి తప్పించడం ఇపుడు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. బుధ, గురువారాల్లో రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులకు బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ పూర్తిచేసి.. ఆ వెంటనే ఆర్డర్స్ ఇచ్చేలా కమిషనర్ ఏర్పాట్లు చేశారు. ఇంతలో మంగళవారం రాత్రి ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆదేశాలొచ్చాయి. ఓ అమాత్యుడు పట్టుబట్టి, సీఎంవోతో పదేపదే సంప్రదించి.. బదిలీ చేయించారనే ప్రచారం జరుగుతోంది. రవాణాశాఖలో కొందరు అధికారులు సైతం భాస్కర్ను ఎలాగైనా పంపేయడానికి తమవంతుగా ఉన్నతస్థాయిలో ప్రయత్నించారని చెబుతున్నారు.
నాటి నుంచే ఒత్తిళ్లు
ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినప్పటి నుంచి రవాణాశాఖలో ఒత్తిళ్లు మొదలయ్యాయి. కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రజాప్రతినిధుల ద్వారా సిఫార్సులు చేయించుకున్నారు. అలాగే కొందరు నేతలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోకి నచ్చినవారిని ఆర్టీవోలు, ఎంవీఐలు, ఏఎంవీలుగా తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కమిషనర్ భాస్కర్మాత్రం నిబంధనలను ఉల్లంఘించేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. రెండేళ్ల కాలపరిమితి దాటిన వారిని, ఇప్పటి వరకు ఫోకల్లో ఉన్నవారిని నాన్ ఫోకల్కు, అలాగే నాన్ ఫోకల్లో ఉన్నవారిని ఫోకల్ పోస్టుల్లోకి బదిలీలు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అందరి నుంచి అభ్యర్థనలు తీసుకున్నారు.
ముందే ఊహించారా?
నేతల సిఫార్సుల గురించి కమిషనర్పై అనేక విధాలుగా ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోలేదని తెలిసింది. ఎవరి మాటా వినకపోవడంతో.. ఏకంగా ఆయన్నే బదిలీ చేస్తారంటూ వారంరోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆయన వెళ్లిపోతే చాలు.. సిఫార్సులను బట్టి బదిలీలు చేయించుకోవచ్చనే భావన నెలకొంది. ఒత్తిళ్లు పెరుగుతుండటంతో కమిషనర్ ఈనెల 30 వరకు ఆగకుండా, 24, 25 తేదీల్లోనే బదిలీలకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో తప్పనిసరై కౌన్సిలింగ్ను 29, 30 తేదీలకు వాయిదా వేశారు. చివరకు ఇప్పుడు ఆయనే బదిలీ అయ్యారు.
మూడు నెలల్లో మార్పు..
కాటంనేని భాస్కర్ ఏప్రిల్ 6న రవాణాశాఖ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు. చాలాకాలంగా ఈ శాఖలో ఐపీఎస్లే కమిషనర్లుగా ఉండగా, ఐఏఎస్ అయిన భాస్కర్కు ఈ బాధ్యతలు ఇచ్చారు. వెంటనే ఆయన ప్రక్షాళన ఆరంభించారు. రోడ్లపై వాహనాలు ఆపి తనిఖీలు చేయొద్దని సిబ్బందికి చెప్పారు. ఏళ్ల తరబడి ఒకే సంస్థ స్మార్ట్ కార్డులు సరఫరా చేస్తుండటం, ఆ సంస్థకు ప్రభుత్వం బకాయిలు ఇవ్వక కార్డుల సరఫరా ఆగిపోవడం.. తదితరాలను గుర్తించి స్మార్ట్కార్డ్ల జారీని ఆపేయాలని నిర్ణయించారు. వాహనదారులు తనిఖీల్లో అవసరమైన పత్రాలన్నీ చూపేందుకు యాప్ రూపొందించారు. వాహన బీమా, కాలుష్య తనిఖీ, రెన్యువల్ గడువు ముగుస్తున్నా, సరకు రవాణాదారుల పన్ను చెల్లింపు కాలం సమీపిస్తున్నా.. వాళ్లందరి ఫోన్లకు సందేశాలు పంపి అప్రమత్తం చేసేవిధానం తీసుకొచ్చారు. 3 నెలల్లో అందరూ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఏర్పాటుచేసుకునేలా ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 3 నెలల్లోనే బదిలీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా