30 అడుగుల విగ్రహం.. రూ.3 కోట్ల వ్యయం

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జులై 4న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించనున్న 30 అడుగుల

Published : 29 Jun 2022 04:44 IST

ప్రధాని ఆవిష్కరించనున్న అల్లూరి ప్రతిమ సిద్ధం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జులై 4న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించనున్న 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏఎస్‌ఆర్‌ పార్కు ప్రాంగణంలో వేదికపై అమర్చారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజల తర్వాత విగ్రహాన్ని ఏడు అడుగుల కాంక్రీటు దిమ్మపైకి చేర్చారు. అల్లూరి అతిపెద్ద కాంస్య విగ్రహం ఇదేనని క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు చెప్పారు. దీని తయారీకి 10 టన్నుల కాంస్యం, 5 టన్నుల ఇనుము వాడారు. దాదాపు రూ.3 కోట్ల వరకు వెచ్చించారు. సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు మంగళవారం అల్లూరి విగ్రహాన్ని సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని