పురపాలక పాఠశాలల విలీనం ఉత్తర్వులు రద్దుచేయాలి
పురపాలక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసన
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసన
ఈనాడు, అమరావతి: పురపాలక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసన తెలిపారు. పాఠశాలలకు హాజరైన ఉపాధ్యాయులు ఉదయం పాఠశాల ప్రాంగణంలో ఆందోళనలు చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయుల నిరసనకు ఎమ్మెల్సీ రఘువర్మ మద్దతు తెలిపారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లా విద్యాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. విలీన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల్లో జిల్లాపరిషత్తు వారిని కలపకూడదని, పురపాలక పాఠశాల సముదాయాలు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రత్యేకంగా మండల విద్యాధికారి, డిప్యూటీ విద్యాధికారి పోస్టులను ఏర్పాటు చేయాలని, పుంగనూరు పురపాలికలో అమలు చేస్తున్నట్లే జీపీఎఫ్ ఖాతాలు ఇవ్వాలని కోరారు. ప్రతి పట్టణ స్థానిక సంస్థ పరిధిలోనూ రెండు మహిళా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న అన్ని సదుపాయాలను పురపాలక టీచర్లకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్తు, పురపాలక ఉపాధ్యాయులకు ఒకే సర్వీసు నిబంధనలు రూపొందిస్తే..పురపాలక ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి నాయకుడు రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. -
సంక్షిప్త వార్తలు
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)