ప్యారిస్‌ వెళ్లిన సీఎం

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ

Published : 29 Jun 2022 05:20 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. 8 గంటలకు ప్రత్యేక విమానంలో ప్యారిస్‌ వెళ్లారు. ముఖ్యమంత్రికి సీఎస్‌ సమీర్‌శర్మ, మంత్రులు పినిపె విశ్వరూప్‌, జోగి రమేష్‌, కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. జులై 3న ఉదయం 6.45 గంటలకు తిరిగి విజయవాడకు రానున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ కుమార్తె హర్షారెడ్డి చదువుతున్న కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి దంపతులు ప్యారిస్‌కు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని