రాజీనామా
పదవిని వీడుతున్నందుకు నేను పశ్చాత్తాపం చెందడం లేదు. బాలాసాహెబ్ ఠాక్రే కుమారుణ్ని సీఎం కుర్చీ నుంచి దించిన ఆనందాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పొందనివ్వండి. వారంతా శివసేన,
విశ్వాస పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే నిష్క్రమణ
బల నిరూపణకు గవర్నర్ ఆదేశంపై మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీంకోర్టు తిరస్కరణ
ఆ వెంటనే పదవి నుంచి దిగిపోయిన మహారాష్ట్ర సీఎం
సొంతవారే వెన్నుపోటు పొడిచారని ఆవేదన
పదవిని వీడుతున్నందుకు నేను పశ్చాత్తాపం చెందడం లేదు. బాలాసాహెబ్ ఠాక్రే కుమారుణ్ని సీఎం కుర్చీ నుంచి దించిన ఆనందాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పొందనివ్వండి. వారంతా శివసేన, బాల్ఠాక్రేల ద్వారానే రాజకీయంగా ఎదిగారు. మా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు నాకు వ్యతిరేకంగా ఉన్నా అది నాకు సిగ్గుచేటు. అంకెల ఆటపై నాకు ఆసక్తి లేదు.
- ఉద్ధవ్ ఠాక్రే
ముంబయి
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ డ్రామా ముగింపు దశకు చేరుకుంది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అశక్తుడైన ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్నీ వదులుకున్నారు. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్ధారించుకున్న ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఫడణవీస్ నేతృత్వంలో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందా? ఠాక్రే మద్దతుదారులు, ఆయన ప్రభుత్వానికి మద్దతు పలికిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఎలా స్పందిస్తాయి? అనేవి ఇప్పుడు ఆసక్తికర అంశాలు.
మహారాష్ట్ర వ్యవహారంలో బుధవారమంతా అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాసనసభను గురువారం ఉదయం 11 గంటలకు సమావేశపరిచి, బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఆదేశించారు. దీనిపై శివసేన అప్పటికప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించలేదు. గవర్నర్ ఆదేశాలను న్యాయస్థానం సమర్థించి, అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని చెప్పింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా విచారణ కొనసాగించి రాత్రి 9.15 గంటల సమయంలో తీర్పు వెలువరించింది. తీర్పును గౌరవిస్తున్నట్లు ఠాక్రే చెబుతూ.. పదవి నుంచి దిగిపోతున్నట్లు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రకటించారు.
వీధుల్లో ఎలాంటి నిరసనలకు దిగవద్దనీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కార్యకర్తలకు సూచించారు. బుధవారం అర్ధరాత్రి రాజ్భవన్కు చేరుకున్న ఠాక్రే తన రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు. దానిని ఆయన ఆమోదించి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు.
గోవా చేరిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు
ఏక్నాథ్ శిందే నేతృత్వంలో గువాహటికి వెళ్లిపోయిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బల నిరూపణలో పాల్గొనేందుకు వీలుగా బుధవారం సాయంత్రం గువాహటి నుంచి బయల్దేరారు. రాత్రి అందరూ అద్దె విమానంలో గోవా చేరుకుని అక్కడే బసచేశారు. గురువారం ఉదయం అక్కడి నుంచి ముంబయికి చేరుకోవాలనేది వారి ప్రణాళిక.
శివసేన ఎమ్మెల్యేల తరఫున చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.బి.పార్దీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ అంశాలను పరిష్కరించడానికి శాసనసభే ఏకైక మార్గమని తేల్చిచెప్పింది. అనర్హత ప్రక్రియను, లేదా దానిని చేపట్టడంలో సభాపతికి ఉన్న అధికారాలపై విశ్వాస పరీక్ష ప్రభావం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఠాక్రే నేతృత్వంలోని వర్గం మైనారిటీలో పడిందని శిందే తరఫు న్యాయవాదులు తెలిపారు.పార్టీలు ఫిరాయించినవారు ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించలేరనీ, గురువారం విశ్వాస పరీక్ష జరగనంతమాత్రాన మిన్ను విరిగి మీద పడిపోదని చీఫ్ విప్ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదించారు. రెబల్స్ అనర్హత పిటిషన్ తేలేవరకు బలపరీక్ష నిర్వహించకూడదన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. శివసేన పిటిషన్పై శాసనసభ కార్యదర్శి, తదితరులకు నోటీసులు ఇచ్చి, ఐదు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 11న జరగనుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ గురువారం శాసనసభ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు ధర్మాసనం అనుమతించింది. సీబీఐ, ఈడీలు వీరిని అసెంబ్లీకి తీసుకువచ్చి, విశ్వాస పరీక్ష పూర్తయ్యాక తిరిగి తీసుకువెళ్లవచ్చని తెలిపింది. విశ్వాసపరీక్షకు వారిని అనుమతించకపోతే ప్రతిపక్ష నేతల్ని కారాగారాల్లో నెట్టే ప్రమాదకర సంస్కృతికి ప్రభుత్వాలు ప్రయత్నించే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.
మంత్రుల సహకారానికి ఠాక్రే కృతజ్ఞతలు!
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే మంత్రిమండలి సమావేశాన్ని ముఖ్యమంత్రి ఠాక్రే నిర్వహించారు. రెండున్నరేళ్లుగా మంత్రులు తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ వ్యాఖ్యలతోనే ఆయన రాజీనామాపై అంచనాలు మొదలయ్యాయి. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్గా మార్చాలన్న తన నిర్ణయానికి కేబినెట్లో మిత్రపక్షాలు వ్యతిరేకించలేదని ఠాక్రే చెప్పారు. అసమ్మతి ఎమ్మెల్యేలకోసం అవసరమైతే ప్రభుత్వం నుంచి వైదొలగి, బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడిందనీ, సొంతవారు మాత్రం తనను వీడి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఇబ్బందులేమైనా ఉంటే అసమ్మతి ఎమ్మెల్యేలు నేరుగా చెప్పి ఉండాల్సిందన్నారు.
శిందే వర్గీయులతో కలిసి భాజపా ప్రభుత్వం?
ఠాక్రే వైదొలగడంతో మహారాష్ట్రలో భాజపా సర్కారు రావచ్చనే అంచనాలు మొదలయ్యాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రులు మద్దతు ఇస్తే ఇది సాధ్యమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఠాక్రే రాజీనామా గురించి తెలిసిన వెంటనే శిందే అనుచరులు గోవాలోని హోటల్లో సమావేశమై మంతనాలు సాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు