ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై.. మిగులు దెబ్బ
ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో పోస్టులు భారీగా మిగిలిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేలకు పైగా పోస్టులు అదనంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు.
సహేతుకంగా లేని హేతుబద్ధీకరణ
టీచర్ల సంఖ్యను తగ్గించే ప్లాన్.. ఇష్టారాజ్యంగా మార్పులు
14 వేల పోస్టులు మిగులు
ప్రాథమికంలో 30 మందికి ఒకరు
9, 10లలో 60 మందికి ఒకరు
కిక్కిరిసిన క్లాసులో పాఠాలు అర్థమయ్యేదెలా?
ఈనాడు - అమరావతి
ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో పోస్టులు భారీగా మిగిలిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేలకు పైగా పోస్టులు అదనంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక బడుల్లో 30 మందికి ఒక్కో టీచర్నే ఇవ్వగా.. 121 మంది కంటే ఎక్కువ ఉంటేనే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయించారు. గతంలో 20మందికి ఒక్క ఉపాధ్యాయుడు ఉండగా.. దీన్ని 30 మంది విద్యార్థులకు పెంచారు. దీంతో ఎస్జీటీ పోస్టుల్లో భారీగా మిగులు ఏర్పడింది. దీనికితోడు ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం వల్ల ఎస్జీటీ పోస్టుల సంఖ్య మరింత తగ్గింది. రాష్ట్రంలో 1, 2 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులు ఉన్న బడులే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒకే టీచర్తో సరిపెట్టారు. ఇది చదువు పునాదినే దెబ్బ తీస్తుంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే బడి మూతపడాల్సిందే. ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయిస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూనే పోస్టులు తగ్గించడం, రద్దు చేయడానికే ప్రయత్నిస్తోంది. విద్యా ప్రమాణాలు, నాణ్యత ఎలా పెరుగుతాయనేది ప్రశ్నార్థకం. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తోంది. కరికులమ్, బోధన విధానాలు అమలు కోసం 5+3+3+4 విద్యా విధానాన్ని తీసుకురాగా.. రాష్ట్రంలో మాత్రం తరగతులను భౌతికంగా విభజించేస్తున్నారు. ఇలా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ చెప్పినా పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు దీన్ని అమలు చేస్తున్నారు.
భవిష్యత్తులో భర్తీకి ఎగనామం..
గత బదిలీల సమయంలో 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేశారు. ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు సర్దుబాటులోనే ఉపాధ్యాయులు మిగులుతున్నందున భవిష్యత్తులో ఈ పోస్టుల భర్తీ ఇక ఉండదు. డీఎస్సీ-98 వారు 4,500 మంది వరకు ఉన్నారు. వీరికి ఒప్పంద పద్ధతిలో 1, 2 తరగతులు ఉండే బడుల్లో పోస్టింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో రెగ్యులర్ ఎస్జీటీల సంఖ్య మరింత తగ్గిపోతుంది. ఇప్పటికే డీఎస్సీ-2008 వారికి ఒప్పంద పద్ధతిలో పోస్టింగ్లు ఇచ్చారు.
* 9, 10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఇంతకంటే ఎక్కువ ఉంటేనే రెండో సెక్షన్ చేయాలనే నిబంధన పెట్టారు. ఈ విధానంతో తరగతి గది కిక్కిరిసిపోతుంది. వెనుక విద్యార్థులకు పాఠాలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. 3-10 వరకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామంటూనే మరోపక్క 6, 7, 8 తరగతులుండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఎస్జీటీలనే కేటాయిస్తున్నారు. ఇదెక్కడి విధానమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ఒకే మాధ్యమంతో మరిన్ని రద్దు..
1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. ఇప్పటి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండటంతో ఒకే పాఠశాలలో రెండు సెక్షన్లకు ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకే మాధ్యమం చేయడంతో తెలుగు మాధ్యమం పోస్టులు రద్దవుతున్నాయి. దీంతో స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు మిగులుతున్నాయి. రెండు మాధ్యమాల వారిని కలిపేసి పాఠం చెబితే పిల్లలకు ఎలా అర్థమవుతుందనే దాన్ని పట్టించుకోవడం లేదు. ఒక సెక్షన్కు ఒక్క ఉపాధ్యాయుడినే ఇస్తున్నారు. ఇది మరిన్ని పోస్టుల రద్దుకు దారి తీసింది.
* 3-10 తరగతులుండే ఉన్నత పాఠశాలల్లో 137 మంది, 6-10 తరగతుల బడిలో 92 మంది పిల్లలుంటే ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను తొలగించారు. ఇక్కడ ఉండే సీనియర్ స్కూల్ అసిస్టెంటే పాఠాలు బోధిస్తూ హెచ్ఎంగానూ వ్యవహరించాలి. ఒక ఉపాధ్యాయుడే పర్యవేక్షణ, తరగతి బోధన ఎలా చేయగలుగుతారు? ఇప్పటికే సబ్జెక్టు ఉపాధ్యాయులకు వారానికి 38-39 పీరియడ్ల వరకు వస్తున్నాయి. ఉపాధ్యాయుడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? పాఠం చెప్పేందుకు ఎప్పుడు సన్నద్ధమవుతారు? ఉన్నతపాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి విధులు ఎలా నిర్వహిస్తారు? సర్దుబాటు కోసం మార్పులు చేసేశారు.
ప్రపంచ బ్యాంకు నిబంధనే కారణమా?
రాష్ట్రంలోహేతుబద్ధీకరణతో మిగిలే ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రపంచ బ్యాంకుతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన’ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ. 1,862 కోట్ల రుణం అందిస్తోంది. మానవ వనరులపై చేసే ఖర్చు తగ్గించుకోవాలన్నది ఈ ఒప్పందంలో ప్రపంచబ్యాంకు విధించిన షరతు. ఇందుకోసమే నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలింపు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడులకు తరలిస్తున్నారు.
వందలకొద్దీ మిగులు పోస్టులు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణ ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయ పోస్టులు భారీగా మిగిలిపోనున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే వీటి సంఖ్య వందల్లో ఉంటోంది.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,800, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఏకంగా 1,600 వరకు పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. కొన్ని జిల్లాల వివరాలివి..
* గుంటూరు జిల్లాలో సుమారు 1,800 ఎస్జీటీ, 140 వరకు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. ఇక్కడ వెయ్యికిపైగా స్కూల్ అసిస్టెంట్లు అవసరం కానున్నట్లు గుర్తించారు. ఎస్జీటీ పదోన్నతులు కల్పించనున్నారు.
* ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,681 ఉపాధ్యాయ పోస్టులు అధికంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 1,954 పోస్టులు మిగులు ఉండగా, 273 అవసరమవుతాయని నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 61 ఉన్నత పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు రద్దు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలలకు 3, 4, 5 తరగతులను తరలించేందుకు 473 బడులను గుర్తించారు.
* ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,600 పోస్టులు ఎక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. 3,793 పోస్టులు మిగులు ఉండగా, 2,193 పోస్టులు అవసరమని జాబితా రూపొందించారు. నిబంధనల ప్రకారం 14,219 పోస్టులు ఉండాల్సి ఉండగా.. ఇక్కడ 15,779 పోస్టులు మంజూరు చేసినట్లు చూపించారు.
* కడప జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంల పోస్టులు 293, ఎస్జీటీలు 1,749 మిగులు ఉన్నట్లు తేల్చారు. ఉన్నత పాఠశాలలకు వచ్చేసరికి 542 పోస్టులు అవసరమని పేర్కొన్నారు. ఇక్కడ ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే కొత్తగా నియామకాల అవసరం లేకపోగా.. ఇంకా పోస్టులు మిగులుతాయి.
* ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు, తెలుగు మాధ్యమంలో 147 పోస్టులు అధికంగా తేల్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 2,440 పోస్టులు అవసరమని నివేదించారు.
ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించాలి: ఎమ్మెల్సీ, విఠపు బాలసుబ్రహ్మణ్యం
‘ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. హేతుబద్ధీకరణ, 3, 4, 5 తరగతుల విలీనంలో ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. పాఠశాల విద్యాశాఖలో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించాలి. వీటిని భర్తీ చేయకుండా హేతుబద్ధీకరణతో సర్దుబాటు చేయడం ఏంటి? పాఠశాలలకు పోస్టులు కేటాయించి, భౌతికంగా ఉపాధ్యాయుడిని ఇవ్వకపోతే ఏం లాభం?’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు