డీఏ బకాయిలు తీసుకోవడం క్రిమినల్ చర్యే
ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన డీఏ బకాయిలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వారిలో ఆందోళనకు దారి తీసింది. తమ ఖాతాల్లోని సొమ్మును ఎలా తీసుకుంటారంటూ
ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నాం: సూర్యనారాయణ
చరిత్రలో జరగని ఘటన: బండి
జులైలోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు: బొప్పరాజు
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన డీఏ బకాయిలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వారిలో ఆందోళనకు దారి తీసింది. తమ ఖాతాల్లోని సొమ్మును ఎలా తీసుకుంటారంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ సూర్యనారాయణ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు. అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని, ఉద్యోగుల అనుమతి లేకుండా ఖాతా నుంచి నిధులు తీసేసుకున్నారని వెల్లడించారు. దీన్ని క్రిమినల్ చర్యగా భావిస్తున్నామని, ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పాత పింఛన్ (ఓపీఎస్), కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) వారికి చెల్లించాల్సిన బకాయిలను కలిపి వేయడం వల్ల సమస్య తలెత్తినట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారని వారు తెలిపారు. జులై నెలాఖరుకు ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
రూ.800 కోట్లు మాయం
- కె.సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్
నిధుల మళ్లింపుపై అధికారుల వివరణ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ ఖాతా నుంచి నిధులు తీసేసుకున్నారు. సుమారు రూ.800 కోట్లు మాయమయ్యాయి. ఇది ఉద్యోగుల ఖాతాలను హ్యాక్ చేయడమే. దీన్ని క్రిమినల్ చర్యగా భావిస్తున్నట్లు అధికారులకు స్పష్టం చేశాం. దీనిపై ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సీఎఫ్ఎంఎస్ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నాం. దానికున్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నిస్తున్నాం. సీఎఫ్ఎంఎస్లో ఉండి ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీని వెనుక లోపాయికారీగా ఏమైనా జరుగుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా వ్యవహరిస్తే వ్యవస్థపై ఉద్యోగి నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది.
చరిత్రలో జరగని ఘటన ఇది
- బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అధ్యక్షుడు
ఉద్యోగుల చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరగలేదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఉదయం నుంచి రెండుసార్లు ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తరఫున ఆర్థికశాఖ అధికారులతో చర్చించాం. రాష్ట్రంలో ఉద్యోగులకు 2018 జులై నుంచి రావాల్సిన డీఏ బకాయిలు ప్రభుత్వం వేసిందా, వేయలేదా అని ప్రశ్నించాం. ఓపీఎస్, సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని కలిపి వేయడం వల్ల సమస్య తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమైన నివేదికలు రాత్రి 8 గంటలకు అందుతాయని చెప్పారు. ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశాం. ఎవరికీ ఏ ఇబ్బంది కలగదని హామీ ఇచ్చారు. ఎవరికైనా సక్రమంగా పడకపోయినా సరిదిద్దే బాధ్యత తీసుకుంటామన్నారు. డీఏ బకాయిలను జులై నెలాఖరుకల్లా ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో వేస్తామని, సీపీఎస్ ఉద్యోగులకు నగదుగా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతుందని భావిస్తున్నాం.
ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు
జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి నిధుల మళ్లింపు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఆర్థిక శాఖాధికారులు చెప్పారు. డీఏ బకాయిలు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి క్రెడిట్, డెబిట్ అనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు. సీఎఫ్ఎంఎస్లో సాంకేతిక సమస్యను గత సంవత్సరం పరిష్కరించనందునే ఈసారి మళ్లీ తలెత్తిందన్నారు. రాష్ట్రంలోని 68 వేల మంది ఉద్యోగుల ఖాతాల్లో నుంచి మాత్రమే నిధులు ఉపసంహరణ అయినట్లు ఏజీ కార్యాలయం తెలిపింది. డీఏ బకాయిలు విడతల వారీగా ఇవ్వడం వల్లే ఇలా జరిగింది. సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి కలిపి వేయడం వల్ల కూడా గందరగోళం నెలకొందని అధికారులు చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరాం. డీఏ బకాయిలు ఎంతమందికి జమయ్యాయి, ఇంకెంతమందికి జమ కావాల్సి ఉందో వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఖాతాల్లో నుంచి ఎంత మొత్తం మళ్లిందనేది ఆర్థికశాఖ అధికారులకే స్పష్టత లేదు. కొంతమంది అనవసరంగా ఉద్యోగుల్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్