ఉద్దేశపూర్వకంగానే పోలవరానికి అవరోధాలు
వైకాపా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా, కావాలని తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం
అందువల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది
కేంద్రం, పీపీఏ హెచ్చరికలనూ పెడచెవిన పెట్టిన జగన్ ప్రభుత్వం
తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టుపై అనిశ్చితి
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం
వేగంగా పూర్తయ్యేలా చూడాలంటూ కేంద్ర జల్శక్తి మంత్రికి లేఖ
ఈనాడు - అమరావతి
వైకాపా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా, కావాలని తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిందని, డయాఫ్రం వాల్ ఎప్పుడు దెబ్బతిందో కూడా గుర్తించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు 71% పూర్తవగా... వైకాపా ప్రభుత్వం తన అసమర్థ నిర్ణయాలతో అవరోధాలు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. గుత్తేదారుల్ని మార్చవద్దంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చేసిన సూచనల్ని జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ఏకపక్షంగా, మొండిగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అనిశ్చితి నెలకొందని.. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్రప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ప్రాజెక్టుకు సాంకేతికంగా జరిగిన నష్టంపై కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కి చంద్రబాబు బుధవారం లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వానికి కేంద్రం వివిధ సందర్భాల్లో చేసిన సూచనలు, పీపీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పత్రాలను ఆ లేఖకు జతచేశారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన లోపాలకు కారణాలేంటో గుర్తించాలని, ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
వరద సమయంలో గాలికొదిలేశారు
2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును బలిపెట్టడం ప్రారంభించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ప్రాజెక్టు గుత్తేదారు సంస్థను ప్రభుత్వం మారుస్తుందని 2019 జూన్ 1నే పత్రికల్లో వార్తలు వచ్చాయి. పనులు నిలిపివేయాలని ఆ సంస్థకు వెంటనే ఆదేశాలూ జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పనులు అప్పగించిన సంస్థను తొలగించి రివర్స్ టెండరింగ్ పేరుతో 2019 నవంబరులో మరో సంస్థను ఎంపికచేశారు. జూన్ నుంచి ఆరు నెలలపాటు ప్రాజెక్టులో ఏ పనులూ జరగలేదు. ఆ ఆరు నెలలూ ప్రాజెక్టు ప్రదేశంలో గుత్తేదారు సంస్థ ప్రతినిధులెవరూ లేరు. అప్పటివరకూ పనిచేస్తున్న అధికారుల్ని కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆ సమయంలో వరద నియంత్రణ సరిగ్గా చేయకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దాన్ని ఒక ప్రముఖ సంస్థ నదీగర్భంలో 40 నుంచి 100 మీటర్ల లోతు వరకు రికార్డు సమయంలో నిర్మించింది. అంత లోతున డయాఫ్రం వాల్ నిర్మించడం దేశంలోనే మొదటిసారి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలవరం అథారిటీ వారించినా..
రాష్ట్రప్రభుత్వ దురుద్దేశపూర్వక నిర్ణయాల్ని అడ్డుకునేందుకు పీపీఏ చాలా ప్రయత్నించిందని, ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా జరుగుతున్న సమయంలో గుత్తేదారును మార్చాల్సిన అవసరం లేదని 2019 ఆగస్టు 13న జరిగిన అత్యవసర సమావేశంలో స్పష్టం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు జరిగిందనడానికి ఆధారాలూ లేవని చెప్పిందన్నారు. ‘గుత్తేదారును మార్చడం వల్ల వ్యయభారం పెరుగుతుందని, ప్రాజెక్టులో జాప్యంతో పాటు, దాని భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తుందని పీపీఏ హెచ్చరించింది. ప్రస్తుత గుత్తేదారును పంపేస్తే... ఆ సంస్థ చేసిన పనుల్లో ఏమైనా లోపాలున్నా చర్యలు తీసుకోలేమని తెలిపింది’ అని చంద్రబాబు వెల్లడించారు. ‘పీపీఏ హెచ్చరికల్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 17న టెండర్ ప్రకటన జారీచేసింది. ప్రాజెక్టు జాప్యమైతే జరిగే నష్టం గురించి ప్రధాన ప్రతిపక్షం తెదేపా చేసిన హెచ్చరికలనూ బేఖాతరు చేసింది’ అని పేర్కొన్నారు.
మాట మారుస్తూనే ఉన్నారు
వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు గడువును ఎప్పటికప్పుడు మారుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘2021 జూన్కే పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. తర్వాత దాన్ని 2021 డిసెంబరుకి, మళ్లీ 2022 జూన్కి పొడిగించారు. ఇప్పుడు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమంటున్నారు. ప్రాజెక్టు జాప్యం వల్ల దేశానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ఆర్ అండ్ ఆర్ వ్యయం పెరగడం ప్రత్యక్షంగా జరిగే నష్టం. ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ప్రయోజనాల్లో జాప్యం పరోక్ష నష్టం’ అని తెలిపారు.
పునరావాసం డబ్బూ కాజేశారు
వైకాపా ప్రభుత్వం 2019 జూన్ నుంచి ప్రాజెక్టు ప్రభావిత ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాల్ని నిలిపివేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతకాలం జాప్యం చేయడంతో ఆర్ అండ్ ఆర్ ఖర్చు భారీగా పెరిగిందన్నారు. ప్రాజెక్టు బాధితులకు ఇచ్చే పునరావాస నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని, నకిలీ పేర్లతో కొందరు ఆ డబ్బు కాజేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల ఉత్తరాంధ్రకు తాగునీరు, రాయలసీమకు సాగునీటి సరఫరాపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. నదుల అనుసంధానం, జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులకూ అవరోధం ఏర్పడిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.