ధర గిట్టుబాటు కాకున్నా...నచ్చబట్టే మద్యం సరఫరా చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తున్న ధర తమకు గిట్టుబాటు కాకపోయినా సరే.. తమకు నచ్చబట్టే మద్యం సరఫరా చేస్తున్నామని లిక్కర్ అండ్ బీరు సరఫరాదారుల సంఘం తెలుగు రాష్ట్రాల
లిక్కర్ అండ్ బీరు సరఫరాదారుల సంఘం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తున్న ధర తమకు గిట్టుబాటు కాకపోయినా సరే.. తమకు నచ్చబట్టే మద్యం సరఫరా చేస్తున్నామని లిక్కర్ అండ్ బీరు సరఫరాదారుల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు కామేశ్వరరావు అన్నారు. కొన్ని బ్రాండ్లు అందుబాటులో లేకపోవటం ప్రభుత్వానికి, ఆయా కంపెనీల విషయమని పేర్కొన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయించిన ధరకు సరఫరా చేయడానికి కంపెనీలు అంగీకరించకపోవటమూ ఒక కారణమై ఉండొచ్చన్నారు. 2017 నుంచి ఇప్పటివరకూ మద్యం సరఫరా కంపెనీలకు చెల్లించే ధరల్ని పెంచలేదని, వాటిని పెంచాలని పదేపదే ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ‘ధర గిట్టుబాటు కాకున్నా సరఫరా చేస్తున్నామంటున్నారు కదా... నష్టానికి వ్యాపారం చేస్తున్నారా? లేకుంటే నాణ్యత తగ్గిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘సరఫరా చేసే మద్యం పరిమాణం పెరిగేకొద్దీ లాభాలు వస్తాయి. నాణ్యతలో తేడా రాదు. మిశ్రమంలో కలిపే మాల్ట్ పరిమాణం తగ్గుతుంది’ అని వివరించారు. అంబర్ స్పిరిట్స్, పెరల్ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీ, ఈగల్ డిస్టిలరీస్ల ప్రతినిధులు వెంకటేశ్వరరావు, శివకుమార్రెడ్డి, చంద్రశేఖర్, సత్యనారాయణరెడ్డితో కలిసి విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ప్రభుత్వం కొన్ని కంపెనీలకే భారీగా సరఫరా ఆర్డర్లు (ఓఎఫ్ఎస్) ఇస్తోంది. వాటి బ్రాండ్లనే ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్నారు. ఇది ఆ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించటం కాదా?
వినియోగదారుడికి నచ్చకపోతే ఆ బ్రాండ్ను బలవంతంగా మార్కెట్లో పెట్టినా అమ్ముడు కాదు. అమ్ముడుకాని బ్రాండుకు ఒకసారైతే ఓఎఫ్ఎస్ ఇవ్వగలరు. పదే పదే ఇవ్వలేరు.
వినియోగదారులు కోరుకునేవి కాకుండా.. ప్రభుత్వం కావాలనుకున్న బ్రాండ్లనే దుకాణాల్లో అమ్ముతూ వాటినే తీసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. ఇది అనుకూలంగా వ్యవహరించటం కాదా?
అలాంటిదేమీ లేదు. అన్ని బ్రాండ్లూ అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఏ బ్రాండు ఎక్కువగా తాగితే అవే అమ్ముడవుతాయి. అవి సరఫరా చేసే కంపెనీలకు ఆర్డర్లు ఆ స్థాయిలోనే వస్తాయి.
గతంలో బాగా అమ్ముడైన బ్రాండ్లు ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభిస్తున్నాయా? ఇప్పుడే వెళ్లి చూద్దామా? అక్కడే వాస్తవం ఏమిటో తేలిపోతుంది కదా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనం వహించారు.
అదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సరఫరా చేసే సుప్రీమ్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండ్ ప్రవేశపెట్టిన నెలకే అత్యధికంగా ఎలా అమ్ముడైంది? దానికి అనుచిత లబ్ధి చేకూర్చలేదా?
అది బ్రాండ్ను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉండొచ్చు. మీరు చెబుతున్న బ్రాండు బాగుండి ఉండొచ్చు.
కొన్ని మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాలు ఉన్నాయంటూ తెదేపా ఎస్జీఎస్ ల్యాబ్ నివేదికను విడుదల చేసిన మర్నాటినుంచే ఆ బ్రాండ్ల అమ్మకాల్ని ఎందుకు నిలిపేశారు? లోపాలు బయటపడతాయనేనా?
మా దురదృష్టం ఏమిటంటే గత అయిదు రోజులుగా ఎయిర్టెల్ నెట్వర్క్లో సాంకేతిక సమస్యల వల్ల డిస్టిలరీల్లో మద్యం బాటిళ్ల స్కానింగ్ సరిగ్గా జరగట్లేదు. స్కానింగ్ అయితే కానీ వాటిని మేము డిపోలకు పంపించలేము. అవి డిపోల నుంచి రిటైల్ దుకాణాలకు వెళ్లాలన్నా అక్కడా స్కానింగ్ చేయాల్సిందే. ఈ సమస్యల వల్లే ఆ బ్రాండ్లు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు.
విష రసాయనాలు లేవు
‘కొన్ని మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాలు ఉన్నాయంటూ ఎస్జీఎస్ పేరిట విడుదల చేసిన నివేదిక సరైనది కాదు. ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం తాము పరీక్షలు చేయలేదని ఎస్జీఎస్ ల్యాబే చెప్పింది. డీఆర్డీఏ ప్రయోగశాలల్లో మేం పరీక్షలు చేయిస్తున్నాం. మూడురోజుల్లో వాటి ఫలితాలు వస్తాయి. మీడియాకు విడుదల చేస్తాం. ఇంకా అపోహలు ఉంటే మా డిస్టిలరీల్లోకి వచ్చి ఎప్పుడైనా నాణ్యత పరిశీలించుకోవచ్చు’ అని కామేశ్వరరావు చెప్పారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో మద్యం సరఫరాదారులకు చెల్లించే ధర తక్కువని, దీన్ని పెంచాలని తాము కోరుతున్నామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్