Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స

‘మీకు వయసు పెరిగి పోయింది..45 నుంచి 50 ఏళ్లు దాటి పోయాయి..మీరు చదువు చెప్పడం మరిచిపోయారు..ఈ వయసులో  పిల్లలకు పాఠాలు ఏమి చెప్పగలరన్నదే నా

Updated : 30 Jun 2022 10:19 IST

మీకు వయసు పెరిగిపోయింది.. ఇప్పుడేమి చదువు చెబుతారు!
1998 డీఎస్సీ అభ్యర్థులతో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

గరివిడి, న్యూస్‌టుడే: ‘మీకు వయసు పెరిగి పోయింది..45 నుంచి 50 ఏళ్లు దాటి పోయాయి..మీరు చదువు చెప్పడం మరిచిపోయారు..ఈ వయసులో  పిల్లలకు పాఠాలు ఏమి చెప్పగలరన్నదే నా భయమంతా.. ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలిచ్చారు..దానికి ఎవరూ అడ్డుపెట్టలేం. మిమ్మల్ని ఏం చేయాలో.. నా బుర్ర పనిచేయడం లేదు..’  డీఎస్సీ-1998లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి.  విజయనగరం జిల్లా గరివిడిలో బుధవారం వైకాపా ఫ్లీనరీ సమావేశం అనంతరం 1998 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు కొందరు మంత్రిని కలిసి కృతజ్ఞతలు చెబుతుండగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అందుకే వారికి మళ్లీ శిక్షణ ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు.

డబ్బే గెలిపిస్తే ప్రధానులుగా టాటా బిర్లాలే ఉండేవారు
ఎన్నికల్లో డబ్బులు పంచడం ద్వారా గెలవచ్చన్న భావన సరికాదని, అలాగైతే టాటా బిర్లాలే ప్రధాన మంత్రులుగా ఉండేవారని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలతో మమేకమై, వారి మనసును గెలుచుకున్న వాడే అసలైన నాయకుడని చెప్పారు. బుధవారం జరిగిన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశంలో బొత్స మాట్లాడారు. ఇటీవల చీపురుపల్లి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు మాటలు విన్న తర్వాత ఆయన సహనం కోల్పోయినట్లు అనిపించిందని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని