జలవనరుల శాఖలో బది‘లీలలు’!
జలవనరుల శాఖలో ప్రస్తుత బదిలీలే నేపథ్యంగా కొందరు జూనియర్లు అందలం ఎక్కేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరు అధికారులు, ఉద్యోగులు ఉన్న స్థానాల్లోనే
ఇంజినీరింగు పోస్టులో లేని ఇంజినీరుదే చక్రం
ఈనాడు, అమరావతి: జలవనరుల శాఖలో ప్రస్తుత బదిలీలే నేపథ్యంగా కొందరు జూనియర్లు అందలం ఎక్కేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరు అధికారులు, ఉద్యోగులు ఉన్న స్థానాల్లోనే కొనసాగేందుకు ముఖ్యులను ప్రసన్నం చేసుకుంటున్నారు. అనేక పోస్టులకు బదిలీల కోసం ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి లేఖలతో ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అదనంగా ప్రస్తుతం ఉన్న బదిలీల అవకాశాలను అందిపుచ్చుకుని కీలక పోస్టులు పొందే ప్రయత్నాలు సాగుతున్నాయి. గురువారంతో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల జలవనరుల శాఖలో డిప్యూటీ ఇంజినీర్ల స్థాయి నుంచి చీఫ్ ఇంజినీరు వరకు పదోన్నతుల ప్రక్రియ ఎప్పటి నుంచో నిలిచిపోయింది. ఫలితంగా అనేక కీలక స్థానాల్లో పూర్తి అదనపు బాధ్యతలతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఒకే ఇంజినీరు రెండు మూడు బాధ్యతలు...అదీ వేర్వేరు జిల్లాల్లో నిర్వహిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించేందుకు సీనియారిటీ ప్రాతిపదిక కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పాలనా సౌలభ్యం అన్న ఒకే ఒక వెసులుబాటు బదిలీల ప్రక్రియను ఉపయోగించుకునే వారికి ఎంతో ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంజినీరు ఇన్ చీఫ్ (పాలన), ఇంజినీరు ఇన్ చీఫ్ (నీటిపారుదల) ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా అదే పోస్టుల్లో ఉంటున్నా వారిని కదిలించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఉండటం వల్ల దక్కే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల స్థానంలో ఉన్న వారికి బదిలీల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటూ కొందరు అవే స్థానాల్లో కొనసాగే ప్రయత్నాలు చేస్తున్నారు.
అదనపు బాధ్యతల కోసం ఉవ్విళ్లు...
జలవనరుల శాఖలో ప్రస్తుతం బదిలీలకు సంబంధించి ఒక వ్యక్తి చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఇంజినీరింగు అధికారిగా పనిచేసి ప్రస్తుతం ఆ హోదాతో సంబంధం లేని పోస్టులో ఆయన ఉన్నారు. రాజధానిలో ఓ కీలకమైన కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల బదిలీ కావాలని కోరుకునే వారు ఆయన ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం. డీఈఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఎస్ఈ స్థాయి పోస్టుల్లో పూర్తి అదనపు బాధ్యతలు తీసుకునేందుకు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. తమకు ఇష్టులైన వారిని ఆయా కీలక స్థానాల్లో కూర్చోబెట్టేందుకు కొందరు జలవనరులశాఖలో ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది.