సంక్షిప్త వార్తలు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రాష్ట్ర సర్కిల్లో జులై ఒకటో తేదీన అప్రెంటీస్ల నియామకం చేపడుతున్నట్లు డీజీఎం (హెచ్ఆర్) జి.అర్జున్సింగ్
1న బీఎస్ఎన్ఎల్లో అప్రెంటీస్ల నియామకం
చుట్టుగుంట (విజయవాడ), న్యూస్టుడే: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రాష్ట్ర సర్కిల్లో జులై ఒకటో తేదీన అప్రెంటీస్ల నియామకం చేపడుతున్నట్లు డీజీఎం (హెచ్ఆర్) జి.అర్జున్సింగ్ తెలిపారు. అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ బోర్డు (బోట్) ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తిరుపతిలోని ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఈసీఈ విభాగం నుంచి డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన 58 మందిని ఎంపిక చేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు www.mhrdnats.gov.in వెబ్సైట్ని సందర్శించవచ్చని ఆయన సూచించారు.
జులై నెలాఖరు వరకూ అందని పాఠ్యపుస్తకాలు
ఈనాడు, అమరావతి: సమగ్ర శిక్ష అభియాన్ అధికారుల నిర్ణయం కారణంగా విద్యార్థులకు జులై నెలాఖరు వరకూ పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి కనిపించట్లేదు. జులై 5న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా 30 వరకూ పాఠ్యపుస్తకాల కోసం ఎదురు చూడాల్సిందే. విద్యాకానుక కిట్లను జులై 30వ తేదీ వరకు పంపిణీ చేసేలా ఉన్నతాధికారి ఆదేశాలు ఇచ్చారు. విద్యాకానుక కిట్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మూడు జతల ఏకరూప దుస్తులు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్, నిఘంటువులు ఇస్తారు. ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు, ఒకటో తరగతికి ఇచ్చే నిఘంటువుల సరఫరా 50% లోపే ఉంది. దీంతో విద్యాకానుక పంపిణీ 26 రోజులపాటు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. రోజుకు 30 నుంచి 40కిట్లు మాత్రమే ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు కిట్ అందితేనే పాఠ్యపుస్తకాలు వస్తాయి. ఉన్నతాధికారి ఆదేశాల కారణంగా ఈ నెల చివరివరకూ కొందరికి పాఠ్య, నోటు పుస్తకాలు అందవు. కొత్తగా ప్రవేశాలు పొందినవారి వివరాలను జులై 15లోపు అందించాలని, వీరికి సెప్టెంబరు 15లోపు విద్యాకానుక అందిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, ‘నాడు-నేడు’, విద్యాకానుక కోసం జూన్లో తెరవాల్సిన బడులను జులైకి వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45.80 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకలను అందించాల్సి ఉంది.
పాత్రికేయులపై వృత్తి పన్ను భారం వేయొద్దు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ వినతి
ఈనాడు డిజిటల్, అమరావతి: పాత్రికేయులపై వృత్తి పన్ను భారం వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకట్రావు, ఆంజనేయులు కోరారు. విజయవాడలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్కుమార్రెడ్డిని కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టుల హెల్త్కార్డుల పునరుద్ధరణ, ప్రమాదబీమా, చిన్న పత్రికలకు జీఎస్టీ తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన కమిషనర్ వృత్తి పన్ను విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చిస్తామని, త్వరలోనే హెల్త్కార్డుల పునరుద్ధరణకు జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఆప్కో ద్వారా రూ.100 కోట్ల విక్రయాలు లక్ష్యం
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆప్కో ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్ల విక్రయాలు లక్ష్యంగా వార్షిక కార్యచరణ సిద్ధం చేయాలని అధికారుల్ని చేనేత, జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి సునీత ఆదేశించారు. విజయవాడలో ఆమె బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రస్తుతమున్న రూ.30 కోట్ల విక్రయాలను రూ.100 కోట్లకు పెంచాలి. అమ్మకాల బాధ్యతను డివిజినల్ మార్కెటింగ్ అధికారులకు అప్పగించి జిల్లా స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విక్రయ ఒప్పందాలు సాధించేలా చర్యలు తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఆప్కో ఛైర్మన్ మోహన్రావు పాల్గొన్నారు.
అశోక్గజపతిరాజుకు కరోనా
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజుకు కరోనా సోకింది. మంగళవారం కుమార్తె అదితి గజపతిరాజుకు కొవిడ్ నిర్ధారణ అయింది. బుధవారం ఆయన కూడా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. రెండు రోజులుగా తనను కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానం ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని అశోక్గజపతిరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు బుధవారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి ఆరు గంటల్లోనే దర్శనం లభిస్తోంది. మంగళవారం 77,154 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.4.62 కోట్ల హుండీ కానుకలు లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం