ఆర్టీసీ బాదుడు
ఆర్టీసీ మరోసారి ఛార్జీల భారం మోపింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి డీజిల్ సెస్ పేరిట ఛార్జీలు పెంచిన సంస్థ... మళ్లీ రెండున్నర నెలలకే అదే డీజిల్ సెస్ పేరు చెబుతూ పెంచింది.
డీజిల్ సెస్ పేరిట రెండున్నర నెలలకే మళ్లీ పెంపు
ప్రయాణికులపై ఏటా రూ.500 కోట్ల వరకు భారం
గరిష్ఠంగా ఎక్స్ప్రెస్లో రూ.90, సూపర్ లగ్జరీలో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంపు
ఈనాడు, అమరావతి: ఆర్టీసీ మరోసారి ఛార్జీల భారం మోపింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి డీజిల్ సెస్ పేరిట ఛార్జీలు పెంచిన సంస్థ... మళ్లీ రెండున్నర నెలలకే అదే డీజిల్ సెస్ పేరు చెబుతూ పెంచింది. దూర ప్రాంత ప్రయాణికులపై ఛార్జీలను బాదేశారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్ఠంగా రూ.20-25 వరకు పెంచగా, ఎక్స్ప్రెస్లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 వరకు గరిష్ఠంగా పెంచారు. విజయవాడ, విశాఖ నగరాల్లో తిరిగే సిటీ బస్సులకు మినహాయింపు ఇచ్చారు. డీజిల్ ధరలు పెరగడంతో నిత్యం రూ.2.50 కోట్లు అదనంగా ఖర్చవుతోందని, అందుకే ఛార్జీలు పెంచామని యాజమాన్యం పేర్కొంది. ఈసారి పెరిగిన ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. ఈ పెంపు శుక్రవారం నుంచే అమలులోకి వస్తుంది.
దూరం పెరిగే కొద్దీ వడ్డింపు
ఏప్రిల్లో పల్లెవెలుగు, సిటీబస్సులు, ఎక్స్ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో టికెట్పై రూ.5, సూపర్లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. కానీ... అప్పట్లో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో దూరాన్ని బట్టి రూ.20 వరకు పెంచారు. ప్రస్తుతమూ దూరాన్ని బట్టి ఛార్జీలు ఎడాపెడా పెంచారు.
* పల్లెవెలుగులో 30 కి.మీ. వరకు పెంపు లేదు. ఆ తర్వాత 35-60 కి.మీ. వరకు రూ.5 చొప్పున, 65-70 కి.మీ.కు రూ.పది, 70-95 కి.మీ.కు రూ.15, 100-120 కి.మీ.కు రూ.20 చొప్పున పెంచారు.
* అల్ట్రా పల్లెవెలుగులో 25 కి.మీ. వరకు ప్రస్తుత ఛార్జీయే ఉంటుంది. 30-55 కి.మీ. దూరానికి రూ.5, 55-65 కి.మీ.కు రూ.10, 65-100 కి.మీ.కు రూ.15, 105-110 కి.మీ.కు రూ.20, 115-120 కి.మీ.కు రూ.25 చొప్పున పెరిగింది.
* ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 30 కి.మీ. వరకు పెరగలేదు. ఆ తర్వాత 20-30 కి.మీ. చొప్పున దూరం పెరిగే కొద్దీ రూ.5 చొప్పున పెంచుతూ... చివరగా 491-500 కి.మీ. దూరానికి రూ.90 పెంచారు.
* అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 20 కి.మీ. వరకు ప్రస్తుత ఛార్జీయే ఉంటుంది. ఆపై 15-30 కి.మీ. చొప్పున దూరం పెరిగే కొద్దీ రూ.5 చొప్పున పెంచుతూ వెళ్లారు. అత్యధికంగా 486-500 కి.మీ. మధ్య దూరానికి రూ.120 పెంచారు.
* సూపర్ లగ్జరీ సర్వీసులో 55 కి.మీ. వరకు ఛార్జీలు యథాతథంగా ఉంటాయి. ఆ తర్వాత దూరానికి అనుగుణంగా రూ.పదేసి పెంచుకుంటూ వెళ్లారు. గరిష్ఠంగా 461-500 కి.మీ. దూరానికి రూ.120 పెరిగింది.
* ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్, నైట్ రైడర్, వెన్నెల వంటి సర్వీసుల్లో తొలి 35-55 కి.మీ. వరకు ఛార్జీల పెంపు లేదు. తర్వాత దూరానికి అనుగుణంగా పెంచారు. గరిష్ఠంగా 500 కి.మీ. వరకు దూరానికి రూ.140 చొప్పున పెరిగింది. ఈ ఏసీ సర్వీసులకు మళ్లీ 5% జీఎస్టీ అదనంగా వసూలు చేయనున్నారు.
తిరుమల ఘాట్ సర్వీసుల్లో రూ.15 పెంపు
తిరుపతి-తిరుమల ఘాట్లో తిరిగే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్పై రూ.15 చొప్పున పెంచారు. ప్రస్తుతం వీటిలో ఛార్జీ రూ.75 ఉండగా... రూ.90 చేశారు. పిల్లలకు రూ.45 ఉండగా రూ.50 చేశారు. కొండపైకి వెళ్లి, వచ్చేందుకు కలిపి తీసుకునే టిక్కెట్ ఛార్జి ప్రస్తుతం రూ.135 ఉండగా దాన్ని రూ.160 చేశారు. పిల్లలకు రూ.85 ఉంటే, రూ.5 పెంచారు.
కనీస ఛార్జీలు ఇలా...
అన్ని సర్వీసుల్లో కనీస ఛార్జీలు చూస్తే... పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగులో రూ.10, ఎక్స్ప్రెస్లో రూ.20, అల్ట్రాడీలక్స్లో రూ.25, సూపర్లగ్జరీలో రూ.40, ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్, నైట్ రైడర్ సీటర్లో రూ.50, నైట్ రైడర్ (బెర్త్), వెన్నెల సర్వీసుల్లో రూ.80గా ఖరారు చేశారు.
విద్యార్థుల పాస్లనూ వదల్లేదు
విద్యార్థులకు జారీ చేసే బస్ పాస్ల ఛార్జీలను సైతం పెంచారు. నగరాల్లో విద్యార్థుల జనరల్ బస్పాస్ ప్రస్తుతం నెలకు రూ.155 ఉండగా, దానిని రూ.300 చేశారు. స్పెషల్్ పాస్లు అయితే రూ.245 నుంచి రూ.350కి పెంచారు. నెలవారీ పాస్ల్లో 4 కి.మీ. వరకు రూ.55 ఉండగా రూ.120 అయింది. 8 కి.మీ.వరకు రూ.65 నుంచి 150 చేశారు. గరిష్ఠంగా 22 కి.మీ. దూరానికి ప్రస్తుతం రూ.105 ఉండగా, రూ.270 చొప్పున నెలవారీ పాస్ ఛార్జీ పెంచారు.
* గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పాస్ల్లో 5 కి.మీ. దూరం వరకు ప్రస్తుతం నెలకు రూ.100 ఉండగా రూ.140 చేశారు. 10 కి.మీ. వరకు రూ.125 ఉండగా, దాన్ని రూ.190కి పెంచారు. 15 కి.మీ. వరకు రూ.160 ఉండగా రూ.240 అయింది. 20 కి.మీ.కు రూ.210 ఉండగా రూ.315 చేశారు. అత్యధికంగా 50 కి.మీ.కు రూ.490 ఉండగా, రూ.735 చేశారు.
విజయవాడ నుంచి హైదరాబాద్కు రూ.70-80 పెరుగుదల
విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో ఛార్జీల రూపంలో ప్రయాణికులపై మరింత భారం పెరుగుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఒక్కొక్కరికీ సూపర్ లగ్జరీలో రూ.70, ఏసీ సర్వీసుల్లో రూ.80 చొప్పున పెరుగుతోంది. విజయవాడ నుంచి విశాఖపట్నానికి సూపర్లగ్జరీలో రూ.80, ఏసీలో రూ.90 పెరుగుతుంది. విజయవాడ నుంచి తిరుపతికి సూపర్లగ్జరీలో రూ.100, ఏసీ సర్వీసుల్లో రూ.110-120 చొప్పున అదనపు భారం పడుతోంది. విశాఖపట్నం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్కు సూపర్లగ్జరీలో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 చొప్పున ఛార్జీ పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.